Telugu Global
NEWS

టీడీపీని అందుకే ఓడించారు....

తెలుగు దేశం పార్టీ ఎందుకు ఓడింది అంటే… చంద్రబాబు పార్టీని పట్టించుకోకపోవడం వల్ల అని కొందరు.. కాదు కాదు.. జగన్ పాదయాత్ర వల్ల అని మరికొందరు.. చంద్రబాబు హామీలు నెరవేర్చలేదని.. సరిగా పాలించలేదని మరికొందరు.. ఇలా కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలన్నట్టు చంద్రబాబు ఓటమికి సహేతుక కారణం మాత్రం ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు. తాజాగా ఒకప్పటి చంద్రబాబు రైట్ హ్యాండ్.. ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చంద్రబాబు ఓటమికి గల కారణాలను చెప్పి సంచలన వ్యాఖ్యలు […]

టీడీపీని అందుకే ఓడించారు....
X

తెలుగు దేశం పార్టీ ఎందుకు ఓడింది అంటే… చంద్రబాబు పార్టీని పట్టించుకోకపోవడం వల్ల అని కొందరు.. కాదు కాదు.. జగన్ పాదయాత్ర వల్ల అని మరికొందరు.. చంద్రబాబు హామీలు నెరవేర్చలేదని.. సరిగా పాలించలేదని మరికొందరు.. ఇలా కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలన్నట్టు చంద్రబాబు ఓటమికి సహేతుక కారణం మాత్రం ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు.

తాజాగా ఒకప్పటి చంద్రబాబు రైట్ హ్యాండ్.. ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చంద్రబాబు ఓటమికి గల కారణాలను చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుజనా చౌదరి మాట్లాడుతూ .. ‘ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో జాప్యం చేయడం వల్లనే తెలుగు దేశం పార్టీని ప్రజలు ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణంలో బాబు చేసిన జాప్యమే ఆయన ఓటమికి కారణమని.. అందువల్లే టీడీపీ ఓడిపోయిందని స్పష్టం చేశారు.

అమరావతిలో కేంద్రానికి సంబంధించిన 130 సంస్థలకు భూముల కేటాయింపు జరిగిందని.. పలు విద్యాసంస్థలకు కేంద్రం నుంచి కూడా అనుమతులు వచ్చాయని.. కానీ బాబు అమరావతిని పూర్తి చేయకపోవడం వల్లనే ఇప్పుడు రాజధాని మారుతుందని సుజనాచౌదరి ఆడిపోసుకున్నారు.

First Published:  29 Dec 2019 8:06 AM GMT
Next Story