Telugu Global
NEWS

70ఏళ్లు గుక్కెడు నీళ్లు లేకుండా బతికాం.... ఇక మీ పప్పులు ఉడకవ్ " టీడీపీపై ధర్మాన పైర్

అమరావతిలోనే అన్ని ఉండాలంటూ టీడీపీ ఉద్యమం చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. అమరావతిలో జరగుతున్నది బోగస్ ఉద్యమమని మండిపడ్డారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్న జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా ఉత్తరాంధ్ర ప్రజలంతా గళమెత్తాలని కోరారు. విశాఖను పరిపాలన రాజధాని కాకుండా అడ్డుకుంటున్న శక్తులను ఎక్కడికక్కడ ఎదిరించాలని ప్రజలను కోరారు. 70ఏళ్లుగా తాగేందుకు గుక్కెడు నీరు లేని బతుకులు బతుకుతున్న ఉత్తరాంధ్ర ప్రజలకు లేని బాధ… ఇప్పుడు అమరావతిలోని 8 గ్రామాలకు ఎందుకు అని ప్రశ్నించారు. […]

70ఏళ్లు గుక్కెడు నీళ్లు లేకుండా బతికాం.... ఇక మీ పప్పులు ఉడకవ్  టీడీపీపై ధర్మాన పైర్
X

అమరావతిలోనే అన్ని ఉండాలంటూ టీడీపీ ఉద్యమం చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. అమరావతిలో జరగుతున్నది బోగస్ ఉద్యమమని మండిపడ్డారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్న జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా ఉత్తరాంధ్ర ప్రజలంతా గళమెత్తాలని కోరారు. విశాఖను పరిపాలన రాజధాని కాకుండా అడ్డుకుంటున్న శక్తులను ఎక్కడికక్కడ ఎదిరించాలని ప్రజలను కోరారు.

70ఏళ్లుగా తాగేందుకు గుక్కెడు నీరు లేని బతుకులు బతుకుతున్న ఉత్తరాంధ్ర ప్రజలకు లేని బాధ… ఇప్పుడు అమరావతిలోని 8 గ్రామాలకు ఎందుకు అని ప్రశ్నించారు. భూములు అభివృద్ధి చేసి, ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా… ఎందుకు ఆందోళన చేస్తున్నారని నిలదీశారు. రాజధానిలో జరుగుతున్నది బోగస్ ఉద్యమమని… టీడీపీ కార్యకర్తలే ఆ ఆందోళనలు చేస్తున్నారని ధర్మాన ఫైర్ అయ్యారు.

” 70 సంవత్సరాలుగా దిక్కుమొక్కు లేకుండా మేం బతుకుతున్నాం. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేకుండా బతికాం. మాకు లేని పోరాటం మీరు ఏమొచ్చింది. మీ భూములు బాగు చేస్తామన్నారు కదా. ప్లాట్లు ఇస్తామన్నారు కదా. అయినా బాధగా ఉందా. తాగడానికి గుక్కెడు నీళ్లు లేని బతుకులు మేం 70 ఏళ్లుగా బతుకుతున్నాం. మాకు లేని బాధ మీకెందుకు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యమం ఉందా. ఆ 8 గ్రామాల్లో మాత్రం లింగులింగుమంటూ ఉద్యమాన్ని విస్తరిస్తామంటున్నారు.

రోజూ మీడియాలో అవే వార్తలు. అవే పెద్దపెద్ద ఫోటోలు. ఇక వీళ్ల పప్పులు ఉడకవ్. అక్కడ జరుగుతున్నది టీడీపీ కార్యకర్తలు చేస్తున్న బోగస్ ఉద్యమం తప్ప ఏమీ కాదు. జగన్‌ మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి విశాఖకు పరిపాలన రాజధాని రావడం ఖాయం. అలాంటి అవకాశం ఇచ్చిన జగన్‌మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలంతా మద్దతుగా నిలబడండి. ఉత్తరాంధ్ర ప్రజలు గళమెత్తాలి. విశాఖను ఎవరు వద్దన్నా వారిపై తిరగబడాలి” అంటూ ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.

First Published:  25 Dec 2019 1:45 AM GMT
Next Story