Telugu Global
NEWS

ఏపీకి 3 రాజధానులు... వెంకయ్య సంచలన వ్యాఖ్యలు

దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎట్టకేలకు తన మనసులోని మాట బయటపెట్టారు. ఏపీకి 3 రాజధానులు చేయడంపై అధికారికంగా ఇప్పటివరకు బీజేపీ నేతలు స్పందించలేదు. జీవీఎల్, పురంధేశ్వరి లాంటి వాళ్లు అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే అంటూ పైపైనే మద్దతు తెలిపారు. ఇక కేంద్రంలోని మోడీ-షాలు సహా కీలక నేతల ఎవరూ ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై నోరు మెదపలేదు. అయితే తాజాగా ఏపీలో పర్యటించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలో 3 రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. […]

ఏపీకి 3 రాజధానులు... వెంకయ్య సంచలన వ్యాఖ్యలు
X

దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎట్టకేలకు తన మనసులోని మాట బయటపెట్టారు. ఏపీకి 3 రాజధానులు చేయడంపై అధికారికంగా ఇప్పటివరకు బీజేపీ నేతలు స్పందించలేదు. జీవీఎల్, పురంధేశ్వరి లాంటి వాళ్లు అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే అంటూ పైపైనే మద్దతు తెలిపారు.

ఇక కేంద్రంలోని మోడీ-షాలు సహా కీలక నేతల ఎవరూ ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై నోరు మెదపలేదు.

అయితే తాజాగా ఏపీలో పర్యటించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలో 3 రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నీట్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్యనాయుడు భారతదేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలని కోరారు.

ఈ సందర్భంగా ఏపీలో అన్ని ఒక చోట పెట్టడం మంచిది కాదని.. రాజధానిలోనే అన్నీ ఉంటే మిగతా ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మద్దతు ఇచ్చినట్టే కనిపిస్తోంది.

First Published:  24 Dec 2019 5:28 AM GMT
Next Story