Telugu Global
Cinema & Entertainment

అంతా ముందే చూపించేస్తున్న దిల్ రాజు

సినిమా ప్రచారంలో ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు దిల్ రాజు. ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో రకాల ప్రచార ప్రయోగాలకు ఒకప్పుడు ఆద్యుడు ఇతడే. అలాంటి దిల్ రాజు, ఇప్పుడు మరో వినూత్న ప్రయోగం చేస్తున్నాడు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న తన సినిమాను ఏకంగా 5 రోజుల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు చూపించడం మొదలుపెట్టాడు. రాజ్ తరుణ్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాను నిర్మించాడు దిల్ రాజు. […]

అంతా ముందే చూపించేస్తున్న దిల్ రాజు
X

సినిమా ప్రచారంలో ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు దిల్ రాజు. ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో రకాల ప్రచార ప్రయోగాలకు ఒకప్పుడు ఆద్యుడు ఇతడే. అలాంటి దిల్ రాజు, ఇప్పుడు మరో వినూత్న ప్రయోగం చేస్తున్నాడు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న తన సినిమాను ఏకంగా 5 రోజుల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు చూపించడం మొదలుపెట్టాడు.

రాజ్ తరుణ్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాను నిర్మించాడు దిల్ రాజు. క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే హైదరాబాద్ లోని చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ కు చూపించాడు. ఈరోజు నెల్లూరులోని మరో కాలేజీ విద్యార్థులకు, రేపు విశాఖలోని ఇంకో కాలేజీ స్టూడెంట్స్ కు చూపించబోతున్నాడు. ఇలా విడుదలకు ముందే ఈ సినిమాను వేల మంది చూసేస్తున్నారన్నమాట.

దీనివెనక కూడా మాస్టర్ ప్లాన్ ఉందంటున్నాడు దిల్ రాజు. తమ సినిమా యూత్ లవ్ స్టోరీ కాబట్టి, విద్యార్థులకు కనెక్ట్ అయితే ఆటోమేటిగ్గా హిట్ అవుతుందనే ఉద్దేశంతో.. ముందుగానే కొంతమంది స్టూడెంట్స్ కు ఇలా చూపిస్తున్నామంటున్నాడు దిల్ రాజు. సినిమా బాగా వచ్చింది కాబట్టి, చూసిన స్టూడెంట్స్ అంతా మిగతా జనాలకు చెబుతారని, అలా మౌత్ టాక్ తో తమ సినిమా పెద్ద హిట్ అవుతుందనేది దిల్ రాజు ఆలోచన. ఈ కొత్త విధానం, ఏ మేరకు సత్ఫలితాల్ని ఇస్తుందో చూడాలి.

First Published:  23 Dec 2019 7:00 AM GMT
Next Story