Telugu Global
National

పోలీసు బూటును ముద్దాడిన మాధవ్

టీడీపీ అధికారంలోకి రాగానే బూట్లు నాకే పోలీసులను తెచ్చి పెట్టుకుంటామంటూ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. జేసీ దివాకర్ రెడ్డికి బుద్ది లేదన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పించే పోలీసులను కించపరచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో పోలీసుల పట్ల జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నాడు పోలీసుగా ఉన్న తాను స్పందించి మీసం మెలేస్తే తనను ప్రజలు […]

పోలీసు బూటును ముద్దాడిన మాధవ్
X

టీడీపీ అధికారంలోకి రాగానే బూట్లు నాకే పోలీసులను తెచ్చి పెట్టుకుంటామంటూ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. జేసీ దివాకర్ రెడ్డికి బుద్ది లేదన్నారు.

ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పించే పోలీసులను కించపరచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో పోలీసుల పట్ల జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నాడు పోలీసుగా ఉన్న తాను స్పందించి మీసం మెలేస్తే తనను ప్రజలు పార్లమెంట్‌కు పంపించారని… అదే జేసీని బజారుకు ఈడ్చారని వ్యాఖ్యానించారు.

ఈ విషయం జేసీ గుర్తు చేసుకోవాలన్నారు. పోలీసులను కించపరుస్తుంటే మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎందుకు మందలించలేదని ప్రశ్నించారు. జేసీ దివాకర్‌ రెడ్డి పనైపోయిందని… కుమారులను దింపి కూడా ప్రయోగం చేసినా ప్రజలు అంగీకరించలేదన్నారు.

జేసీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు నవ్వుతూ కూర్చోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నిజస్వరూపం ఇదేనా అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ పోలీసుల బూట్లను శుభ్రం చేసి… వాటిని ముద్దాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలను చంద్రబాబు, జేసీ దివాకర్ రెడ్డి గుర్తించుకోవాలన్నారు.

First Published:  20 Dec 2019 1:10 AM GMT
Next Story