Telugu Global
NEWS

విండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత

జరిమానాతో ఆవిరైన తొలివన్డే విజయం వన్డే క్రికెట్ రెండోర్యాంకర్ భారత్ తో జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ లోని తొలివన్డేలో 8 వికెట్ల అలవోక విజయం సాధించిన కరీబియన్ టీమ్ విజయానందం.. ఒక్కసారిగా ఆవిరైపోయింది. స్లో ఓవర్ రేటు కారణంగా వెస్టిండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోతవిధిస్తూ మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. ఐసీసీ క్రికెటర్ల నిబంధనావళి 2.22 ప్రకారం నిర్ణిత సమయంలో ఓవర్లు వేయడంలో విఫలమైతే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 నుంచి 80 శాతం […]

విండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత
X
  • జరిమానాతో ఆవిరైన తొలివన్డే విజయం

వన్డే క్రికెట్ రెండోర్యాంకర్ భారత్ తో జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ లోని తొలివన్డేలో 8 వికెట్ల అలవోక విజయం సాధించిన కరీబియన్ టీమ్ విజయానందం.. ఒక్కసారిగా ఆవిరైపోయింది.

స్లో ఓవర్ రేటు కారణంగా వెస్టిండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోతవిధిస్తూ మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. ఐసీసీ క్రికెటర్ల నిబంధనావళి 2.22 ప్రకారం నిర్ణిత సమయంలో ఓవర్లు వేయడంలో విఫలమైతే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 నుంచి 80 శాతం మ్యాచ్ ఫీజును కోతగా విధించే అవకాశం ఉంది.

చెన్నై వన్డేలో మాత్రం కరీబియన్ జట్టు ఉద్దేశపూర్వకంగా స్లోఓవర్ రేట్ పాటించినట్లుగా మ్యాచ్ రిఫరీ గమనించి గరిష్టంగా 80 శాతం కోత విధించారు.

చెపాక్ లో ముగిసిన తొలివన్డేలో హెట్ మేయర్, హోప్ సెంచరీలు సాధించడంతో వెస్టిండీస్ భారీలక్ష్యాన్ని సైతం అలవోకగా చేదించి… 8 వికెట్ల విజయంతో… మూడుమ్యాచ్ ల సిరీస్ లో 1-0తో పైచేయి సాధించిన సంగతి తెలిసిందే.

First Published:  16 Dec 2019 10:07 PM GMT
Next Story