Telugu Global
NEWS

అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులన్నీ భాస్కర్‌నాయుడికి ఇచ్చింది నిజం కాదా చంద్రబాబు?

సభలో పచ్చి అబద్దాలు చెబుతున్న టీడీపీ నేతలకు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వకుండా ఇంకేం చేయాలని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. అవుల్ సోర్సింగ్ పేరుతో లంచాలు తీసుకోవడం, ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి వసూళ్లు చేయడం, చివరకు ఉద్యోగులకు జీతం ఇచ్చే సమయంలోనూ లంచం తీసుకోవడం వంటివి చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పొట్ట కొడుతున్నారన్న ఉద్దేశంతోనే అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ తెచ్చామన్నారు. అవుట్ సోర్సింగ్ పేరుతో చివరకు గుళ్లలో క్లీనింగ్ కాంట్రాక్టు కూడా చంద్రబాబునాయుడు […]

అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులన్నీ భాస్కర్‌నాయుడికి ఇచ్చింది నిజం కాదా చంద్రబాబు?
X

సభలో పచ్చి అబద్దాలు చెబుతున్న టీడీపీ నేతలకు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వకుండా ఇంకేం చేయాలని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి.

అవుల్ సోర్సింగ్ పేరుతో లంచాలు తీసుకోవడం, ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి వసూళ్లు చేయడం, చివరకు ఉద్యోగులకు జీతం ఇచ్చే సమయంలోనూ లంచం తీసుకోవడం వంటివి చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పొట్ట కొడుతున్నారన్న ఉద్దేశంతోనే అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ తెచ్చామన్నారు.

అవుట్ సోర్సింగ్ పేరుతో చివరకు గుళ్లలో క్లీనింగ్ కాంట్రాక్టు కూడా చంద్రబాబునాయుడు తన బంధువైన భాస్కర్‌ నాయుడికి ఇచ్చుకున్నారని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవుట్ సోర్సింగ్ పేరుతో మొత్తం టీడీపీ నేతలకు కావాల్సిన వారిని పెట్టుకున్నారని ఆరోపించారు.

భాస్కర్‌నాయుడి వివరాలు కావాలంటే ఇచ్చేందుకు, చంద్రబాబుకు ఆయన ఎలా బంధువు అవుతారు అన్న వివరాలన్నీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కొందరు వ్యక్తుల చేతిలో దోపిడికి గురికాకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వమే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు.

గతంలో ఎస్సీఎస్టీబీసీలకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా వారికీ అవకాశం కలిగేలా చేస్తున్నట్టు చెప్పారు. రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో చంద్రబాబును చూస్తే తెలుస్తుందన్నారు.

First Published:  17 Dec 2019 12:14 AM GMT
Next Story