Telugu Global
CRIME

అత్తను రేప్ చేశాడు.... భార్య కాళ్లు పట్టుకున్నాడు.... తర్వాత మాయమయ్యాడు..!

మద్యం మత్తులో దారుణాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దిశ, సమత సంఘటనలు మద్యం మత్తులోనే జరిగాయని… తెలంగాణలో మద్యం నియంత్రణ చేయాలని అన్ని వర్గాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దారుణం జరిగింది. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలో ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరికీ రాత్రి పూట విధులు ఉండటంతో భార్య తన తల్లిని కేరళలోని […]

అత్తను రేప్ చేశాడు.... భార్య కాళ్లు పట్టుకున్నాడు.... తర్వాత మాయమయ్యాడు..!
X

మద్యం మత్తులో దారుణాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దిశ, సమత సంఘటనలు మద్యం మత్తులోనే జరిగాయని… తెలంగాణలో మద్యం నియంత్రణ చేయాలని అన్ని వర్గాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దారుణం జరిగింది.

పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలో ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరికీ రాత్రి పూట విధులు ఉండటంతో భార్య తన తల్లిని కేరళలోని పాలక్కడ్ నుంచి నగరానికి పిలిపించుకుంది. వాళ్లు ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ఆమె చిన్నారిని చూసుకునేది.

ఈ క్రమంలో నవంబర్ 13న అల్లుడు విధులకు వెళ్లలేదు. అంతే కాకుండా ఇంట్లోనే మద్యం సేవించాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న అత్త మీద అత్యాచారం చేశాడు. ఉదయాన్నే కుమార్తె వచ్చే సమయానికి తల్లి ఏడుస్తూ ఉంది. ఏమయ్యిందని కూతురు ప్రశ్నించగా తల్లి జరిగిన దారుణాన్ని వెల్లడించింది. దీంతో భార్య.. భర్తను నిలదీసింది.

కాగా, భార్య బంధువులందరినీ పిలిపించి పంచాయితీ పెట్టింది. దీంతో.. తాను తప్పు చేశానని.. దారుణానికి ఒడిగట్టానని తనను క్షమించమని అందరి ముందూ భార్య కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు. తాను విడాకులు ఇస్తానని.. భరణం కూడా ఇస్తానని చెప్పాడు.

ఇక అదేరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అతను ఇంత వరకు ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య, అత్త పంజాగుట్ట పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  14 Dec 2019 11:27 PM GMT
Next Story