Telugu Global
CRIME

హైదరాబాద్ లో చంపినట్టు చంపండి: ఉన్నావ్ బాధితురాలి తండ్రి డిమాండ్

ఉన్నావ్ లో అత్యాచార బాధితురాలు తుదిశ్వాస విడిచింది. సామూహిక అత్యాచారం చేసిన నిందితులు కొద్దిరోజుల క్రితం ఈమెపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. కోర్టుకు హాజరయ్యేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్తుండగా రేపిస్టులు ఈమెపై పెట్రోల్ పోసి నిప్పటించారు. 90శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఈమె నిన్న రాత్రి తుదిశ్వాస విడిచింది. తమ కూతురు మరణించడంతో బాధితురాలి తండ్రి రగిలిపోతున్నారు. ఈ సందర్భంగా తమ కూతురిని అత్యంత కిరాతకంగా చంపారని.. హైదరాబాద్ లో దిశ హంతకులను […]

హైదరాబాద్ లో చంపినట్టు చంపండి: ఉన్నావ్ బాధితురాలి తండ్రి డిమాండ్
X

ఉన్నావ్ లో అత్యాచార బాధితురాలు తుదిశ్వాస విడిచింది. సామూహిక అత్యాచారం చేసిన నిందితులు కొద్దిరోజుల క్రితం ఈమెపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. కోర్టుకు హాజరయ్యేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్తుండగా రేపిస్టులు ఈమెపై పెట్రోల్ పోసి నిప్పటించారు. 90శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఈమె నిన్న రాత్రి తుదిశ్వాస విడిచింది.

తమ కూతురు మరణించడంతో బాధితురాలి తండ్రి రగిలిపోతున్నారు. ఈ సందర్భంగా తమ కూతురిని అత్యంత కిరాతకంగా చంపారని.. హైదరాబాద్ లో దిశ హంతకులను చంపినట్టే ఇక్కడ కూడా చంపాలని డిమాండ్ చేశారు. తనకు ఇల్లు, డబ్బు, వద్దని.. తన కూతురికి న్యాయం జరిగితే చాలని ఉన్నవ్ బాధితురాలి తండ్రి డిమాండ్ చేశాడు.

హైదరాబాద్ పోలీసులు చేసిన న్యాయమే యూపీ పోలీసులు కూడా చేసి సత్వరం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులందరినీ కాల్చిచంపాలని.. లేదా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అలా చేసినప్పుడే తన కూతురు ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

నిందితులు పెట్రోల్ పోసి తగులబెట్టడంతో దాదాపు కిలోమీటర్ దూరం పరిగెత్తిన యువతి చివరకు ఆస్పత్రికి సృహ కోల్పోకుండా చేరింది. అయితే మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించినా ఆమె ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ కౌంటర్ చేసినట్టే యూపీలోనూ ఈమెను చంపిన వారిని కాల్చి చంపాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

First Published:  7 Dec 2019 4:40 AM GMT
Next Story