Telugu Global
NEWS

బాలినేనితో గొట్టిపాటి... వైవీతో రాపాక... ఏం చ‌ర్చించారు?

ఏపీలో ఓ టీడీపీ ఎమ్మెల్యే…ఏకైక జ‌న‌సేన ఎమ్మెల్యే అధికార పార్టీకి ద‌గ్గ‌రైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రూ పార్టీ మారేందుకు కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మ‌న‌వ‌డి పుట్టిన‌రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ బ‌ర్త్‌డే ఫంక్ష‌న్‌కు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కూడా వ‌చ్చారు. ఇక్క‌డే పార్టీ మారే విష‌యంపై బాలినేనితో చ‌ర్చించార‌ట‌. అయితే త‌న ప‌రిస్థితిని వాళ్ల‌కు వివ‌రించార‌ని తెలుస్తోంది. అయితే హైక‌మాండ్ మాత్రం గొట్టిపాటి విష‌యంలో చాలా క్లియ‌ర్‌గా ఉంద‌ట‌. […]

బాలినేనితో గొట్టిపాటి... వైవీతో రాపాక... ఏం చ‌ర్చించారు?
X

ఏపీలో ఓ టీడీపీ ఎమ్మెల్యే…ఏకైక జ‌న‌సేన ఎమ్మెల్యే అధికార పార్టీకి ద‌గ్గ‌రైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రూ పార్టీ మారేందుకు కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మ‌న‌వ‌డి పుట్టిన‌రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ బ‌ర్త్‌డే ఫంక్ష‌న్‌కు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కూడా వ‌చ్చారు. ఇక్క‌డే పార్టీ మారే విష‌యంపై బాలినేనితో చ‌ర్చించార‌ట‌. అయితే త‌న ప‌రిస్థితిని వాళ్ల‌కు వివ‌రించార‌ని తెలుస్తోంది.

అయితే హైక‌మాండ్ మాత్రం గొట్టిపాటి విష‌యంలో చాలా క్లియ‌ర్‌గా ఉంద‌ట‌. ఆయ‌న్ని పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధంగానే ఉందని చెబుతున్నారు.

ఇక రాజోలు జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఇటీవ‌ల టీటీడీ ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డిని క‌లిశారు. కాకినాడ ఎంపీ వంగా గీత‌తో పాటు జిల్లా ప్ర‌ముఖుల‌తో క‌లిసి వైవీతో మీటింగ్ అయ్యారు.

గోదావ‌రి జిల్లాల వైసీపీ ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి. దీంతో రాపాక పార్టీమారేందుకు వైవీని క‌లిశార‌ని జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. జిల్లా నేత‌ల‌తో మాట్లాడేందుకు ఈ స‌మావేశం జ‌రిగింద‌ని స‌మాచారం. రాపాక కూడా కండువా మార్పిడికి క్యూలైన్‌లో ఉన్నార‌ని టాక్‌.

మొత్తానికి ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీ మారే అంశంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే వీరి పార్టీ మార్పుపై క్లారిటీ వ‌స్తుంద‌ని తెలుస్తోంది .

First Published:  26 Nov 2019 12:10 AM GMT
Next Story