Telugu Global
NEWS

రాజధాని భూముల్లో టీడీపీ నేతల బాగోతం.. బయటపెట్టిన రైతులు

అమరావతి అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే అమరావతి అన్నట్లు ప్రచారం చేసుకున్న టీడీపీ అధినేతకు తాజాగా షాక్ తగిలింది. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతికి భూములిచ్చిన దళిత రైతులు తాజాగా ఆయనకు షాకిచ్చారు. సోమవారం మధ్యాహ్నం రాజధాని రైతులు మీడియాతో మాట్లాడుతూ బాబు తీరును ఎండగట్టారు.. ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించాలంటే చంద్రబాబు ఇక్కడి దళిత రైతులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజధాని కోసం మా భూములు తీసుకున్న చంద్రబాబు తమకు ఇచ్చిన ప్లాట్ల […]

రాజధాని భూముల్లో టీడీపీ నేతల బాగోతం.. బయటపెట్టిన రైతులు
X

అమరావతి అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే అమరావతి అన్నట్లు ప్రచారం చేసుకున్న టీడీపీ అధినేతకు తాజాగా షాక్ తగిలింది. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతికి భూములిచ్చిన దళిత రైతులు తాజాగా ఆయనకు షాకిచ్చారు. సోమవారం మధ్యాహ్నం రాజధాని రైతులు మీడియాతో మాట్లాడుతూ బాబు తీరును ఎండగట్టారు..

ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించాలంటే చంద్రబాబు ఇక్కడి దళిత రైతులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజధాని కోసం మా భూములు తీసుకున్న చంద్రబాబు తమకు ఇచ్చిన ప్లాట్ల మధ్యలో 25 లక్షల గజాలు ఎందుకు హోల్డ్ లో పెట్టారో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములకు ఎందుకు తక్కువ ప్యాకేజీ ఇచ్చారో చెప్పాలని కోరారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వద్ద 9వేల ఎకరాలు కొని లాభపడ్డారని.. తమను నట్టేట ముంచారని ఆరోపించారు.

చంద్రబాబు అమరావతికి వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని దళిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసాన్ని అందరికీ చెప్పాలనే ఈ సమావేశం ఏర్పాటు చేశామని ధ్వజమెత్తారు.

అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకుంటున్న చంద్రబాబుకు…. ఇలా అక్కడి భూముల విషయంలో దళిత రైతులు ఎదురుతిరగడం సంచలనంగా మారింది. రాజధాని భూముల్లో టీడీపీ నేతల బాగోతాన్ని కూడా రైతులు బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది.

First Published:  25 Nov 2019 3:41 AM GMT
Next Story