Telugu Global
NEWS

వైసీపీలో చేరిన అద్దేపల్లి శ్రీధర్

మాజీ జనసేన నాయకుడు అద్దేపల్లి శ్రీధర్‌ వైసీపీలో చేరారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. గతంలో జనసేనలో పనిచేసిన అద్దేపల్లి ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చేశారు. ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగగా…ఫలితాలు రాకముందే ఏప్రిల్‌ 20న ఆయన జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. ఎన్నికలకు ముందే జనసేన దారి తప్పిందని ఆయన గుర్తించారు. దాంతో రాజీనామా చేసి బయటకు వచ్చారు. అద్దేపల్లి శ్రీధర్‌ చర్చా కార్యక్రమాల్లో మంచి వక్తగా […]

వైసీపీలో చేరిన అద్దేపల్లి శ్రీధర్
X

మాజీ జనసేన నాయకుడు అద్దేపల్లి శ్రీధర్‌ వైసీపీలో చేరారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. గతంలో జనసేనలో పనిచేసిన అద్దేపల్లి ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చేశారు.

ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగగా…ఫలితాలు రాకముందే ఏప్రిల్‌ 20న ఆయన జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. ఎన్నికలకు ముందే జనసేన దారి తప్పిందని ఆయన గుర్తించారు. దాంతో రాజీనామా చేసి బయటకు వచ్చారు.

అద్దేపల్లి శ్రీధర్‌ చర్చా కార్యక్రమాల్లో మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. చర్చా కార్యక్రమాల్లో నోటికొచ్చినట్టు అరవడం కాకుండా ఏపార్టీలో ఉన్నా సరే హుందాగా… కేవలం సబ్జెక్ట్ ఆధారంగానే మాట్లాడుతుంటారు.

First Published:  6 Nov 2019 5:16 AM GMT
Next Story