Telugu Global
National

బాబు నోటిఫై చేయలేదు.... అందుకే మ్యాప్‌లో అమరావతి గల్లంతు

ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలా ఏపీ రాజధానికి తాను గుర్తింపు తెస్తే… ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన మ్యాప్‌లో అమరావతి లేకుండాపోయిందని చంద్రబాబు సోమవారం ఆరోపించారు. జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వమే అమరావతికి అడ్రస్ లేకుండా చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. అయితే అసలు నిజం ఏంటో చంద్రబాబు సన్నిహితుడు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరే స్వయంగా బయటపెట్టారు. అమరావతిని ఇండియా మ్యాప్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించగా… ప్రభుత్వం ఈ అంశంపై లేఖ రాయలేదని […]

బాబు నోటిఫై చేయలేదు.... అందుకే మ్యాప్‌లో అమరావతి గల్లంతు
X

ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలా ఏపీ రాజధానికి తాను గుర్తింపు తెస్తే… ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన మ్యాప్‌లో అమరావతి లేకుండాపోయిందని చంద్రబాబు సోమవారం ఆరోపించారు. జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వమే అమరావతికి అడ్రస్ లేకుండా చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

అయితే అసలు నిజం ఏంటో చంద్రబాబు సన్నిహితుడు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరే స్వయంగా బయటపెట్టారు. అమరావతిని ఇండియా మ్యాప్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించగా… ప్రభుత్వం ఈ అంశంపై లేఖ రాయలేదని అందుకే ఆ పరిస్థితి వచ్చిందన్నారు.

తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సర్వే ఆఫ్ ఇండియా తన పరిధిలోనే ఉండేదని… రాష్ట్రాల్లో ఏదైనా మార్పులు జరిగితే ఆ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాల్సి ఉంటుందన్నారు. కానీ చంద్రబాబు అలా అమరావతిని నోటిఫై చేయడంలో విఫలమయ్యారని సుజనా వెల్లడింఆచరు. రాష్ట్రం నుంచి లేఖ రాకపోవడం, నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మ్యాప్‌లో అమరావతి గల్లంతు అయిందని సుజనా వివరించారు.

First Published:  5 Nov 2019 9:03 AM GMT
Next Story