Telugu Global
NEWS

జగన్ నిర్ణయంపై కేశినేని నాని ప్రశంసలు

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని … ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగుల ఆస్పత్రిలో కేశినేని నాని తన ఎంపీ నిధులతో నిర్మించిన భవనాన్ని మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. ఈ సందర్బంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మంచి పరిణామమన్నారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు తాను నిజంగానే మనస్పూర్తిగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. తాను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడే […]

జగన్ నిర్ణయంపై కేశినేని నాని ప్రశంసలు
X

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని … ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగుల ఆస్పత్రిలో కేశినేని నాని తన ఎంపీ నిధులతో నిర్మించిన భవనాన్ని మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. ఈ సందర్బంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మంచి పరిణామమన్నారు.

ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు తాను నిజంగానే మనస్పూర్తిగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. తాను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడే వ్యక్తినని చెప్పారు. ఇది ఖచ్చితంగా మంచి పరిణామమన్నారు.

ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తే లాభాలు వచ్చినంత సేపు బస్సులు తిప్పి.. నష్టాలు రాగానే మూసేస్తారని… దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతారన్నారు.

ప్రభుత్వమే ఆర్టీసీని చేపట్టడం మంచి నిర్ణయమని… నిర్వాహణ సమర్దవంతంగా చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. మంత్రి పేర్ని నాని తండ్రి కూడా ఎన్‌ఎంయూ ప్రెసిడెంట్‌గా చేశారని… అలాంటి కుటుంబం నుంచి వచ్చిన పేర్నినాని మంత్రిగా ఉండడం కార్మికుల అదృష్టమన్నారు కేశినేని నాని.

First Published:  31 Oct 2019 12:26 AM GMT
Next Story