Telugu Global
NEWS

ట్విట్టర్ లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబుదే !

లక్ష్మీపార్వతి.. దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భార్యగా మనకు తెలుసు. టీడీపీ ఎన్టీఆర్ నుంచి చేజారి చంద్రబాబుకు చేతులు మారడంలో ఈమెనే బూచిగా చూపారు. అప్పటి నుంచి చంద్రబాబును నమ్మకద్రోహిగా అభివర్ణిస్తూ పోరాడుతోంది లక్ష్మీపార్వతి. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న లక్ష్మీపార్వతి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. పీపీఏలు, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పేరుతో ఆరు లక్షల కోట్ల అవినీతిని చంద్రబాబు చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి […]

ట్విట్టర్ లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబుదే !
X

లక్ష్మీపార్వతి.. దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భార్యగా మనకు తెలుసు. టీడీపీ ఎన్టీఆర్ నుంచి చేజారి చంద్రబాబుకు చేతులు మారడంలో ఈమెనే బూచిగా చూపారు. అప్పటి నుంచి చంద్రబాబును నమ్మకద్రోహిగా అభివర్ణిస్తూ పోరాడుతోంది లక్ష్మీపార్వతి.

ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న లక్ష్మీపార్వతి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. పీపీఏలు, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పేరుతో ఆరు లక్షల కోట్ల అవినీతిని చంద్రబాబు చేశారని ఆరోపించారు.

మాజీ మంత్రి లోకేష్ ను కడిగేశారు. ‘ట్విట్టర్ లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబుదేనని’ విమర్శించారు. ఏనాడూ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం నారా లోకేష్ చేయలేరని దుయ్యబట్టారు.

జగన్ పాలనపై విమర్శలు చేసే హక్కు చంద్రబాబుకు లేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. చివరకు మాజీ స్పీకర్ కోడెల మరణాన్ని కూడా చంద్రబాబు శవరాజకీయం చేశారని మండిపడ్డారు.

ఎల్లో మీడియతో మహిళనైన తనను కూడా ఇబ్బందులు పెట్టారని.. ఇప్పుడు జగన్ ను ఇబ్బందులు పెట్టడానికి చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్ర పన్నాయని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.

జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే నాలున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారన్నారు. చంద్రబాబు బురద జల్లడమే కానీ ఇలా ప్రజలకు ఏమైనా మేలు చేశాడా.? అని మండిపడ్డారు. జగన్ పరిపాలనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసే బాబు జీర్ణించుకోవడం లేదని లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు.

First Published:  28 Sep 2019 4:47 AM GMT
Next Story