Telugu Global
CRIME

డోర్‌లో చొక్కా... 8కి.మీలు వ్యక్తిని ఈడ్చుకెళ్లిన క్యాబ్

శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద క్యాబ్‌ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎనిమిది కిలోమీటర్ల మేర క్యాబ్‌ ఈడ్చుకెళ్లడంతో యాదయ్య అనే వ్యక్తి చనిపోయాడు. ఎయిర్‌పోర్టు వద్ద క్యాబ్‌లోకి ప్రయాణికులు ఎక్కుతుండగా అంతలో అటువైపుగా పోలీసు జీపు వచ్చింది. దాంతో క్యాబ్‌ డ్రైవర్ హడావుడిగా వాహనాన్ని ముందుకు నడిపించాడు. ఆ సమయంలో యాదయ్య అనే వ్యక్తి ఇంకా క్యాబ్‌లోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో క్యాబ్‌ ముందుకు కదిలింది. యాదయ్య చొక్కా క్యాబ్‌ డోర్‌లో ఇరుక్కుపోయింది. అలా […]

డోర్‌లో చొక్కా... 8కి.మీలు వ్యక్తిని ఈడ్చుకెళ్లిన క్యాబ్
X

శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద క్యాబ్‌ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎనిమిది కిలోమీటర్ల మేర క్యాబ్‌ ఈడ్చుకెళ్లడంతో యాదయ్య అనే వ్యక్తి చనిపోయాడు. ఎయిర్‌పోర్టు వద్ద క్యాబ్‌లోకి ప్రయాణికులు ఎక్కుతుండగా అంతలో అటువైపుగా పోలీసు జీపు వచ్చింది. దాంతో క్యాబ్‌ డ్రైవర్ హడావుడిగా వాహనాన్ని ముందుకు నడిపించాడు.

ఆ సమయంలో యాదయ్య అనే వ్యక్తి ఇంకా క్యాబ్‌లోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో క్యాబ్‌ ముందుకు కదిలింది. యాదయ్య చొక్కా క్యాబ్‌ డోర్‌లో ఇరుక్కుపోయింది. అలా చొక్కా ఇరుక్కోవడంతో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం యాదయ్యను క్యాబ్ ఈడ్చుకువెళ్లింది. కానీ ఆ విషయాన్ని డ్రైవర్‌ గమనించలేదు.

శంషాబాద్ టోల్‌గేట్‌ వద్ద ఇతర వాహనదారులు గమనించి కేకలు వేయడంతో కారు ఆపాడు. చూడగా అప్పటికే యాదయ్య తీవ్ర గాయాలతో రక్త స్రావం జరిగి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో క్యాబ్‌ డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు.

First Published:  25 Sep 2019 3:40 AM GMT
Next Story