Telugu Global
Cinema & Entertainment

‘రామాయణ’... శ్రద్ధా కపూర్ డిమాండ్ ఇది !

నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి ‘రామాయణ’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మూడు భాగాలుగా ఉండనుంది. అది కూడా త్రీడీ ఫార్మాట్లో కావడం విశేషం. మొదటి భాగాన్ని 2021 నాటికి ప్రేక్షకులకు అందివ్వాలనుకుంటున్నారు నిర్మాతలు. ‘దంగల్’ సినిమా తో బాలీవుడ్ లో రికార్డులు సృష్టించిన దర్శకుడు నితీష్ తివారి ఈ మధ్యనే ‘చిచ్చోరే’ అనే సినిమాతో […]

‘రామాయణ’... శ్రద్ధా కపూర్ డిమాండ్ ఇది !
X

నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి ‘రామాయణ’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా మూడు భాగాలుగా ఉండనుంది. అది కూడా త్రీడీ ఫార్మాట్లో కావడం విశేషం. మొదటి భాగాన్ని 2021 నాటికి ప్రేక్షకులకు అందివ్వాలనుకుంటున్నారు నిర్మాతలు.

‘దంగల్’ సినిమా తో బాలీవుడ్ లో రికార్డులు సృష్టించిన దర్శకుడు నితీష్ తివారి ఈ మధ్యనే ‘చిచ్చోరే’ అనే సినిమాతో మరో హిట్ ను అందుకున్నారు.

తాజాగా ఇప్పుడు రవి ఉద్యవార్ తో కలిసి నితీష్ ‘రామాయణ’ అనే భారీ బడ్జెట్ సినిమాని చేయబోతున్నాడు.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన మరియు నమిత్ మల్హోత్రా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 3డి ఫార్మెట్లో ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కనుంది.

మొదటి భాగం 2021లో విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అన్ని భాషల నుంచి స్టార్ నటీనటులను ఎంపిక చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

రాముడి పాత్రలో హృతిక్ రోషన్, రావణాసురుడి పాత్రలో ప్రభాస్ ను అనుకుంటున్న దర్శక నిర్మాతలు సీత పాత్ర కోసం దీపికా పడుకొనే ను సంప్రదించారట…. కానీ ఆమె కాదనడంతో ఈ ఆఫర్ శ్రద్ధ కపూర్ దగ్గరకు వెళ్ళింది.

అయితే ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ఏకంగా 10 నుంచి 11 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. బాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న శ్రద్ధా కపూర్ ఈ మధ్యనే ‘సాహో’ లాంటీ భారీ బడ్జెట్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అదే జోరుతో ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. మరి ఆమెకి కోట్లు ఇచ్చి సినిమాలో ఎంపిక చేస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  25 Sep 2019 5:37 AM GMT
Next Story