Telugu Global
Cinema & Entertainment

పూజ హెగ్డే తో డేట్ చేసి... సాయి పల్లవిని పెళ్ళి చేసుకుని.. రాశి ఖన్నా ని చంపేస్తాడట !

బాలీవుడ్ లో పాపులర్ అయిన ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ టాక్ షో ఇప్పుడు తెలుగులో కూడా మొదలైన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కి మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. తాజాగా నిన్ననే ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. దీంట్లో మెగా హీరో వరుణ్ తేజ్ గెస్ట్ గా వచ్చాడు. తన గురించి మాట్లాడుతూ బోలెడు విషయాలను బయటపెట్టాడు వరుణ్ తేజ్. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి అడిగిన ఒక […]

పూజ హెగ్డే తో డేట్ చేసి... సాయి పల్లవిని పెళ్ళి చేసుకుని.. రాశి ఖన్నా ని చంపేస్తాడట !
X

బాలీవుడ్ లో పాపులర్ అయిన ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ టాక్ షో ఇప్పుడు తెలుగులో కూడా మొదలైన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కి మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తుంది.

తాజాగా నిన్ననే ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. దీంట్లో మెగా హీరో వరుణ్ తేజ్ గెస్ట్ గా వచ్చాడు. తన గురించి మాట్లాడుతూ బోలెడు విషయాలను బయటపెట్టాడు వరుణ్ తేజ్.

ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి అడిగిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు వరుణ్ తేజ్ ఇచ్చిన జవాబు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కిల్, మ్యారీ, డేట్… ఇందులో ఒక్కో హీరోయిన్ కి ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేయమని సాయి పల్లవి, రాశి ఖన్నా, పూజ హెగ్డే పేర్లను ఆప్షన్ గా ఇచ్చింది మంచు లక్ష్మి.

దానికి వరుణ్ తేజ్ రాశి ఖన్నా ని చంపేస్తానని, పూజ హెగ్డే తో డేట్ చేసి సాయి పల్లవి ని పెళ్లి చేసుకుంటానని వరుణ్ తేజ్ అన్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా వరుణ్ తేజ్ సరసన ‘ముకుందా’ సినిమాలో నటించింది. చాలా కాలం తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి ఈ మధ్యనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో నటించారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. మరోవైపు వరుణ్ తేజ్ పెళ్లాడాలి అనుకున్న సాయి పల్లవి తో ‘ఫిదా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

First Published:  23 Sep 2019 12:00 PM GMT
Next Story