Telugu Global
NEWS

కోడెల మృతి సందర్భంగా రంగా విగ్రహానికి పాలాభిషేకం.. కోడెలపై వంగవీటి నరేంద్ర ఘాటు వ్యాఖ్యలు

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి సందర్భంగా విజయవాడలో వంగవీటి రంగా అభిమానులు రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వంగవీటి రంగా అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని తెలియగానే విజయవాడలో వంగవీటి రంగా అభిమానులు… రంగా విగ్రహానికి నివాళులర్పించారు. పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రంగా సోదరుడి కుమారుడు, బీజేపీ నేత వంగవీటి నరేంద్ర పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంగాను హత్య చేసిన ముఖ్యమైన వాళ్లలో ఒకడైన […]

కోడెల మృతి సందర్భంగా రంగా విగ్రహానికి పాలాభిషేకం.. కోడెలపై వంగవీటి నరేంద్ర ఘాటు వ్యాఖ్యలు
X

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి సందర్భంగా విజయవాడలో వంగవీటి రంగా అభిమానులు రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వంగవీటి రంగా అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు.

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని తెలియగానే విజయవాడలో వంగవీటి రంగా అభిమానులు… రంగా విగ్రహానికి నివాళులర్పించారు. పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రంగా సోదరుడి కుమారుడు, బీజేపీ నేత వంగవీటి నరేంద్ర పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రంగాను హత్య చేసిన ముఖ్యమైన వాళ్లలో ఒకడైన కోడెల శివప్రసాదరావు అనే నీచుడు చనిపోవడం తమకు చాలా చాలా సంతోషంగా ఉందన్నారు. మహానాయకుడిగా ఎదుగుతున్న రంగాను దారుణంగా నడిరోడ్డుపై హత్య చేశారని మండిపడ్డారు.

కోడెల కుటుంబం అధికారం అడ్డుపెట్టుకుని చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కాదన్నారు. చివరకు అసెంబ్లీ ఫర్నిచర్‌ను కూడా దోచుకున్న కుటుంబం కోడెలది అన్నారు. అతడు డాక్టర్ కోడెల కాదని… దొంగ కోడెల అని వంగవీటి నరేంద్ర విమర్శించారు. కోడెల శివప్రసాదరావు లాంటి ప్రజాభక్షకులను కొన్ని మీడియా సంస్థలు గొప్పనాయకుడిగా చిత్రీకరించడం చాలా బాధాకరమన్నారు నరేంద్ర.

వంగవీటి రంగా హత్య సమయంలో కోడెల శివప్రసాదరావే హోంమంత్రిగా ఉన్నారు. ఈ హత్య వెనుక కీలక సూత్రధారి కోడెలే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల వల్లే కోడెల అప్పట్లో హోంమంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు.

First Published:  17 Sep 2019 2:36 AM GMT
Next Story