Telugu Global
Cinema & Entertainment

రాజశేఖర్ కొత్త సినిమా ఇదే

పుకార్లే నిజమయ్యాయి. రాజశేఖర్ రీమేక్ కు ఓకే చెప్పాడు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. సింగిల్ లైన్ కథ వినగానే ఎగ్జైట్ అయిన రాజశేఖర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాను రీమేక్ […]

రాజశేఖర్ కొత్త సినిమా ఇదే
X

పుకార్లే నిజమయ్యాయి. రాజశేఖర్ రీమేక్ కు ఓకే చెప్పాడు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. సింగిల్ లైన్ కథ వినగానే ఎగ్జైట్ అయిన రాజశేఖర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు.

అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాను రీమేక్ గా చెప్పడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ రాకతో ఇప్పుడు ప్రతి సినిమా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేసింది. ఏ సినిమా నుంచి రీమేక్ చేస్తున్నారనే విషయం తెలిసిన వెంటనే ఈ మాధ్యమాల నుంచి సదరు ఒరిజినల్ సినిమాను చూసేస్తున్నారు ప్రేక్షకులు. ఇది రీమేక్ కు ఇబ్బందిగా మారుతోంది. అందుకే మేకర్స్ ఎవరూ ఈ విషయాన్ని బయటపెట్టడం లేదు. రాజశేఖర్ సినిమాకు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. తెలుగు ‘క్షణం’ ను శిబిరాజ్ తో ‘సత్య’గా తీయటంతో పాటు ‘బేతాళుడు’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. హీరోయిన్ తో పాటు మిగిలిన పాత్రధారులు, సాంకేతిక నిపుణులను త్వరలో ఎంపిక చేయనున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి మార్చి 2020లో సినిమాను విడుదల చేస్తామంటున్నారు ధనుంజయన్.

First Published:  19 Aug 2019 11:16 PM GMT
Next Story