Telugu Global
NEWS

రాజేంద్రప్రసాద్ కు.... ఫృథ్వీ కౌంటర్

ఏపీ సీఎంగా జగన్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ గుర్తించడం లేదని నటుడు, వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ ఫృథ్వీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై తలోరకంగా స్పందించారు. వైసీపీకి సపోర్టర్ గా ఉన్న పోసానికృష్ణమురళి సైతం ఫృథ్వీ వ్యాఖ్యలను ఖండించాడు. అయితే తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్ ఈ విషయంపై హాట్ కామెంట్స్ చేశాడు. జగన్ సీఎం కాగానే కలవడానికి సినిమావాళ్లు ఏమైనా వ్యాపారస్థులా? వారికేమైనా మేలు జరుగుతుందనుకుంటే వెంటనే కలుస్తారా? సినిమా వాళ్లకు […]

రాజేంద్రప్రసాద్ కు.... ఫృథ్వీ కౌంటర్
X

ఏపీ సీఎంగా జగన్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ గుర్తించడం లేదని నటుడు, వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ ఫృథ్వీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై తలోరకంగా స్పందించారు. వైసీపీకి సపోర్టర్ గా ఉన్న పోసానికృష్ణమురళి సైతం ఫృథ్వీ వ్యాఖ్యలను ఖండించాడు.

అయితే తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్ ఈ విషయంపై హాట్ కామెంట్స్ చేశాడు. జగన్ సీఎం కాగానే కలవడానికి సినిమావాళ్లు ఏమైనా వ్యాపారస్థులా? వారికేమైనా మేలు జరుగుతుందనుకుంటే వెంటనే కలుస్తారా? సినిమా వాళ్లకు అలాంటి అలిగేషన్స్ లేవు…. కాబట్టి తీరిగ్గా కలుస్తారు…. అంటూ కామెంట్స్ చేశాడు.

కాగా ఈ కామెంట్స్ పై తాజాగా ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ నేత ఫృథ్వీ కౌంటర్ ఇచ్చారు. తిరుమలేషుడి దర్శనానికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్…. ఇలా కొండపై రాజకీయాలు మాట్లాడడం సరికాదని హితవు పలికారు.

కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను ఇది దెబ్బతీసిందన్నారు. కొండమెట్లు ఎక్కినప్పుడు ఎవరూ రాజకీయాలపై మాట్లాడవద్దని హితవు పలికారు.

చంద్రబాబును ఇదే రాజేంద్ర ప్రసాద్ కలిసినప్పుడు లేని ఆలస్యం…. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అని రాజేంద్ర ప్రసాద్ ను ఫృథ్వీ తాజాగా ప్రశ్నించారు. ఇందులోనే పక్షపాతం కనిపిస్తోందని రాజేంద్రప్రసాద్ తీరును ఫృథ్వీ కడిగిపారేశారు.

First Published:  16 Aug 2019 2:24 AM GMT
Next Story