Telugu Global
NEWS

పార్టీ ఆఫీస్‌ ప్రారంభించిన జగన్‌... ఎంపీ, మాజీ ఎమ్మెల్యేతో రిబ్బన్ కటింగ్

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన కేంద్ర కార్యాలయాన్ని తాడేపల్లిలో ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేత రిబ్బన్ కటింగ్ చేయించారు జగన్. పార్టీ ఆఫీస్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. తన చాంబర్‌లో కాసేపు నేతలు, కార్యకర్తలతో ముచ్చటించారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భారీగా కార్యకర్తలు వచ్చారు. పార్టీ ఆఫీస్‌ ఏర్పాట్లను […]

పార్టీ ఆఫీస్‌ ప్రారంభించిన జగన్‌... ఎంపీ, మాజీ ఎమ్మెల్యేతో రిబ్బన్ కటింగ్
X

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన కేంద్ర కార్యాలయాన్ని తాడేపల్లిలో ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేత రిబ్బన్ కటింగ్ చేయించారు జగన్. పార్టీ ఆఫీస్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు.

తన చాంబర్‌లో కాసేపు నేతలు, కార్యకర్తలతో ముచ్చటించారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భారీగా కార్యకర్తలు వచ్చారు. పార్టీ ఆఫీస్‌ ఏర్పాట్లను తొలి నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తూ వచ్చారు.

పార్టీ కార్యకర్తలకు పార్టీ కార్యాలయం ఎళ్ళవేళలా అందుబాటులో ఉంటుందని వైసీపీ ప్రకటించింది. కీలకమైన నేతలు కూడా పార్టీ ఆఫీస్‌ లో తరుచూ అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. పార్టీ కార్యాలయం వద్ద నవరత్నాలకు సంబంధించిన పోస్టర్లను ఏర్పాటు చేశారు.

First Published:  10 Aug 2019 1:38 AM GMT
Next Story