Telugu Global
NEWS

కియా యాజమాన్యం పై వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

కియా తొలి కారు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌… యాజమాన్యంపై తీవ్రంగా మండిపడ్డారు. కంపెనీ తీరుపై నిరసన తెలిపారు. తన నిరసనను కియా తొలికారుపైనే రాశారు. తొలికారుపై అభిప్రాయాలు రావాల్సిందిగా ప్రజాప్రతినిధులను కోరగా… గోరంట్ల మాధవ్‌ తన నిరసన తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు. యాజమాన్యం ఇప్పటికీ చంద్రబాబు మత్తులోనే ఉందన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పనిచేస్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు. యాజమాన్యం తీరుతో తన కడుపు మండుతోందంటూ కియా తొలి కారుపై ” […]

కియా యాజమాన్యం పై వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
X

కియా తొలి కారు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌… యాజమాన్యంపై తీవ్రంగా మండిపడ్డారు. కంపెనీ తీరుపై నిరసన తెలిపారు. తన నిరసనను కియా తొలికారుపైనే రాశారు. తొలికారుపై అభిప్రాయాలు రావాల్సిందిగా ప్రజాప్రతినిధులను కోరగా… గోరంట్ల మాధవ్‌ తన నిరసన తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు. యాజమాన్యం ఇప్పటికీ చంద్రబాబు మత్తులోనే ఉందన్నారు.

చంద్రబాబు డైరెక్షన్‌లోనే పనిచేస్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు. యాజమాన్యం తీరుతో తన కడుపు మండుతోందంటూ కియా తొలి కారుపై ” కియా కార్ రోల్ అవుట్… బట్ అవర్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ ఈజ్ రూల్డ్ అవుట్” అంటూ మాధవ్ రాశారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీ ఏమాత్రం ప్రయత్నించడం లేదన్నారు.

మంచి ఉద్యోగాలకు ఇతర ప్రాంతాల వారిని తెచ్చి… వాచ్‌మెన్లు, బాత్రూమ్ క్లీనింగ్, గడ్డి పీకడం వంటి పనులకు మాత్రం స్థానికులను వాడుతున్నారని మండిపడ్డారు. కొత్తకారు విడుదల సందర్భంగా విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో సీఎం పేరు గానీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లుగానీ లేకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ. కియా యాజమాన్యంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని గోరంట్ల మాధవ్ చెప్పారు.

First Published:  8 Aug 2019 11:37 PM GMT
Next Story