Telugu Global
NEWS

వెంటనే జగన్‌ను కలవడానికి తామేమీ వ్యాపారవేత్తలం కాదు...

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన బృందం కలవకపోవడంపై చర్చ జరుగుతోంది. జగన్‌ సీఎం అవడం చిత్రపరిశ్రమలోని వారికి ఇష్టం లేదని… అందుకే ఆయన్ను కలిసేందుకు చిత్రబృందం రాలేదని ఫృథ్వీ ఇటీవల విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నటుడు రాజేంద్రప్రసాద్ స్పందించారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఎంను వెంటనే కలవడానికి తామేమీ వ్యాపారవేత్తలం కాదని వ్యాఖ్యానించారు. అసలు కళాకారులు వెళ్లి సీఎంను కలవాలన్న నిబంధన ఎక్కడా లేదు కదా […]

వెంటనే జగన్‌ను కలవడానికి తామేమీ వ్యాపారవేత్తలం కాదు...
X

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన బృందం కలవకపోవడంపై చర్చ జరుగుతోంది. జగన్‌ సీఎం అవడం చిత్రపరిశ్రమలోని వారికి ఇష్టం లేదని… అందుకే ఆయన్ను కలిసేందుకు చిత్రబృందం రాలేదని ఫృథ్వీ ఇటీవల విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో నటుడు రాజేంద్రప్రసాద్ స్పందించారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఎంను వెంటనే కలవడానికి తామేమీ వ్యాపారవేత్తలం కాదని వ్యాఖ్యానించారు. అసలు కళాకారులు వెళ్లి సీఎంను కలవాలన్న నిబంధన ఎక్కడా లేదు కదా అంటూ కామెంట్స్ చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా సెటిల్ అయిన తర్వాత తాము వెళ్లి కలుస్తామన్నారు.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిత్రపరిశ్రమ పట్ల సానుకూలంగా ఉంటారని తాము భావిస్తున్నామన్నారు. జగన్‌తో చిత్రపరిశ్రమ వారికి మంచి సంబంధాలే ఉన్నాయని… శనివారం సీఎం జగన్‌ను కలవాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది మరో రెండుమూడు రోజులు వాయిదా పడిందన్నారు.

First Published:  9 Aug 2019 10:24 AM GMT
Next Story