Telugu Global
NEWS

నేడు పోలవరం వద్దకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పోలవరం ప్రాంతంలో నేడు పర్యటించనున్నారు. కాపర్ డ్యాం కారణంగా పలు గ్రామాలు ముంపుకు గురైన నేపథ్యంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు అందుతున్న సాయంపై ఆరా తీయనున్నారు. గత ప్రభుత్వం పునరావాసం ఆలోచన చేయకుండా కాపర్ డ్యాంను నిర్మించడంతో ఇప్పుడు దేవీపట్నంతో పాటు పలు గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేయనున్నారు. వర్షా కాలం ముగిసిన తర్వాత తిరిగి పోలవరం […]

నేడు పోలవరం వద్దకు జగన్
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పోలవరం ప్రాంతంలో నేడు పర్యటించనున్నారు. కాపర్ డ్యాం కారణంగా పలు గ్రామాలు ముంపుకు గురైన నేపథ్యంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు అందుతున్న సాయంపై ఆరా తీయనున్నారు.

గత ప్రభుత్వం పునరావాసం ఆలోచన చేయకుండా కాపర్ డ్యాంను నిర్మించడంతో ఇప్పుడు దేవీపట్నంతో పాటు పలు గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేయనున్నారు. వర్షా కాలం ముగిసిన తర్వాత తిరిగి పోలవరం నిర్మాణం మొదలయ్యే అవకాశాలున్నాయి. దాంతో వచ్చే ఏడాది ముంపు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలవరం వద్ద పరిస్థితిపై అధికారులతో జగన్‌ సమీక్ష చేయనున్నారు.

First Published:  8 Aug 2019 12:43 AM GMT
Next Story