Telugu Global
Cinema & Entertainment

డ్యూయల్ రోల్ లో మెగా హీరో !

‘సుప్రీమ్’ స్టార్ సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే ‘చిత్రాలహరి’ సినిమాతో ఎట్టకేలకు ఒక మంచి హిట్ ను అందుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ మరియు నివేద పేతురాజ్ లు హీరోయిన్లుగా నటించారు. వరుస ఫ్లాపులతో నిరాశలో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. అదే జోరుతో ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్ […]

డ్యూయల్ రోల్ లో మెగా హీరో !
X

‘సుప్రీమ్’ స్టార్ సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే ‘చిత్రాలహరి’ సినిమాతో ఎట్టకేలకు ఒక మంచి హిట్ ను అందుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ మరియు నివేద పేతురాజ్ లు హీరోయిన్లుగా నటించారు.

వరుస ఫ్లాపులతో నిరాశలో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. అదే జోరుతో ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవలేదు…. కానీ అప్పుడే సాయి ధరమ్ తేజ్ మరొక సినిమా ని లైన్ లో పెట్టాడు.

తాజా సమాచారం ప్రకారం…. సాయి ధరమ్ తేజ్ ఒక యువ దర్శకుడితో కలిసి ఒక థ్రిల్లర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా సాయి ధరమ్ తేజ్ కమర్షియల్ సినిమాలలో తప్ప థ్రిల్లర్ సినిమాలో కనిపించలేదు.

అంతేకాకుండా ఈ సినిమాలో తేజు డ్యూయల్ రోల్ పోషించబోతున్నాడని తెలుస్తోంది. ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  6 Aug 2019 3:28 AM GMT
Next Story