Telugu Global
NEWS

పయ్యావుల కేసీఆర్‌ ద్వారా ట్రై చేశారట...

టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారన్న వార్తలు ఇటీవల వచ్చాయి. తానా సభల్లో బీజేపీ నేతలు … పయ్యావులతో భేటీ అవడం కూడా ఇందుకు బలాన్నిచ్చింది. అయితే పయ్యావుల అంతకు ముందే వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ సీనియర్ నేత, ఉరవకొండకే చెందిన శివరామిరెడ్డి స్వయంగా ఒక చర్చలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల తర్వాత పయ్యావుల కేశవ్‌ వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఇందుకు కేసీఆర్‌ ద్వారా జగన్‌మోహన్‌ […]

పయ్యావుల కేసీఆర్‌ ద్వారా ట్రై చేశారట...
X

టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారన్న వార్తలు ఇటీవల వచ్చాయి. తానా సభల్లో బీజేపీ నేతలు … పయ్యావులతో భేటీ అవడం కూడా ఇందుకు బలాన్నిచ్చింది.

అయితే పయ్యావుల అంతకు ముందే వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ సీనియర్ నేత, ఉరవకొండకే చెందిన శివరామిరెడ్డి స్వయంగా ఒక చర్చలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎన్నికల తర్వాత పయ్యావుల కేశవ్‌ వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఇందుకు కేసీఆర్‌ ద్వారా జగన్‌మోహన్‌ రెడ్డికి సిఫార్సు చేయించారని పయ్యావుల కేశవ్ మనుషులే చెబుతున్నారని శివరామిరెడ్డి వెల్లడించారు.

అయితే కేసీఆర్‌ సిపార్సు చేసినప్పటికీ కూడా నేరుగా పయ్యావులను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్‌ మోహన్ రెడ్డి అంగీకరించలేదని చెబుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే పయ్యావులను పార్టీలో చేర్చుకుంటామని చెప్పడంతో కేశవ్ వెనక్కు తగ్గారట. ఆతర్వాత బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే చంద్రబాబు గుర్తించి పీఏసీ పదవి ఇచ్చారని శివరామిరెడ్డి వెల్లడించారు.

First Published:  4 Aug 2019 8:57 AM GMT
Next Story