Telugu Global
NEWS

మంచి రోజులు వచ్చేశాయి.... ఇక పార్టీలు మారడాలు ప్రారంభం

ఆషాడం వెళ్లింది. శ్రావణం వచ్చేసింది. ఆగస్ట్ 2 నుంచి శ్రావణం ప్రవేశించింది. ఐదు నుంచి మంచిరోజులు ఉన్నాయి. కానీ పెళ్లి ముహూర్తాలు లేవు. అయితే పార్టీ మారాలి అనుకునే నేతలు ఇప్పుడు ఏం చేస్తారనేది ఓ ప్రశ్న. ఈ నెలలో ఏపీ, తెలంగాణలో కొంత మంది నేతలు పార్టీ మారుతారని జోరుగా వార్తలు విన్పిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులతో పాటు కొంతమంది కాపు నేతలు పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు విన్పిస్తున్నాయి. వారు […]

మంచి రోజులు వచ్చేశాయి.... ఇక పార్టీలు మారడాలు ప్రారంభం
X

ఆషాడం వెళ్లింది. శ్రావణం వచ్చేసింది. ఆగస్ట్ 2 నుంచి శ్రావణం ప్రవేశించింది. ఐదు నుంచి మంచిరోజులు ఉన్నాయి. కానీ పెళ్లి ముహూర్తాలు లేవు. అయితే పార్టీ మారాలి అనుకునే నేతలు ఇప్పుడు ఏం చేస్తారనేది ఓ ప్రశ్న. ఈ నెలలో ఏపీ, తెలంగాణలో కొంత మంది నేతలు పార్టీ మారుతారని జోరుగా వార్తలు విన్పిస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులతో పాటు కొంతమంది కాపు నేతలు పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు విన్పిస్తున్నాయి. వారు బీజేపీలో చేరే అకాశం ఉందనేది ఓ వైరల్ న్యూస్. మంచి రోజుల కోసం ఆగిన ఆయన ఈ నెలలోనే పార్టీ మారే చాన్స్ ఉందని తెలుస్తోంది.

మరోవైపు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా పక్క చూపులు చూస్తున్నారట. ఏ పార్టీలోకి వెళ్ళాలి అని ఆయన లెక్కలు వేసుకుంటున్నారట. ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్ లో ఉన్న ఆయన విజయవాడకు త్వరలో రాబోతున్నారు. వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

వీరే కాదు. చాలా మంది నేతలు పార్టీ మారేందుకు లెక్కలు వేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీకి చెందిన పది నుంచి 20 మంది నేతలు ఆగస్ట్ నెలలోనే జంప్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరారు. సీమకు చెందిన పలువురు నేతలు కూడా పార్టీ మారే అవకాశం ఉందని సమాచారం.

టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా పర్యటన నుంచి వచ్చేసరికి ఒకటి రెండు వికెట్లు పడే అవకాశం ఉంది. ఆఫర్లు నచ్చితే ఇంకా ఎక్కువ వెళ్ళే చాన్స్ ఉంది. మొత్తానికి శ్రావణ మాసం జంప్ జిలానీల టైమ్ కాబోతుంది.

First Published:  2 Aug 2019 2:19 AM GMT
Next Story