Telugu Global
Cinema & Entertainment

శేష్ సినిమాకి... చిన్మయి పాటతో ప్రమోషన్

ఈ మధ్యనే ‘గూడచారి’ అనే థ్రిల్లర్ సినిమాలో స్పై గా కనిపించిన అడివి శేష్ ఇప్పుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఎవరు’ అనే క్రైమ్ థ్రిల్లర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్ర లో కనిపించబోతున్నాడు. వెంకట్ రామ్ జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెజినా కసాండ్రా హీరోయిన్ గా నటించింది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమా నుండి ‘ఎన్నెన్నో’ అనే పాటను విడుదల […]

శేష్ సినిమాకి... చిన్మయి పాటతో ప్రమోషన్
X

ఈ మధ్యనే ‘గూడచారి’ అనే థ్రిల్లర్ సినిమాలో స్పై గా కనిపించిన అడివి శేష్ ఇప్పుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఎవరు’ అనే క్రైమ్ థ్రిల్లర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్ర లో కనిపించబోతున్నాడు. వెంకట్ రామ్ జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెజినా కసాండ్రా హీరోయిన్ గా నటించింది.

తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమా నుండి ‘ఎన్నెన్నో’ అనే పాటను విడుదల చేసారు. ఈ లిరికల్ వీడియో ని ఇప్పుడు ఇంటర్నెట్ లో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

శ్రీచరణ్ పాకల ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ పాటను చిన్మయి శ్రీపాద పాడింది. రమేష్ వి ఎన్ వి లిరిక్స్ అందించాడు.

పీవీపీ సినిమా బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాతో కూడా అడివి శేష్ పెద్ద హిట్ అందుకుంటాడు అని అభిమానులు ఆశిస్తున్నారు.

First Published:  31 July 2019 12:30 AM GMT
Next Story