Telugu Global
National

రేప్‌ బాధితురాలి కుటుంబంపై బీజేపీ ఎమ్మెల్యే కుట్ర.... మరో కేసు నమోదు

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యేల తీరు దుమారం రేపుతోంది. యూపీలో సంచలన సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబాన్ని మొత్తం హత్య చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ ప్రయత్నించిన అంశం దుమారం రేపుతోంది. రాజ్యసభలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. 2017లో 17 ఏళ్ల బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ అత్యాచారం చేశాడు. ఈ కేసులో గతేడాది ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఇంకా జైలులోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో అత్యాచార బాధితురాలి […]

రేప్‌ బాధితురాలి కుటుంబంపై బీజేపీ ఎమ్మెల్యే కుట్ర.... మరో కేసు నమోదు
X

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యేల తీరు దుమారం రేపుతోంది. యూపీలో సంచలన సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబాన్ని మొత్తం హత్య చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ ప్రయత్నించిన అంశం దుమారం రేపుతోంది.

రాజ్యసభలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. 2017లో 17 ఏళ్ల బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ అత్యాచారం చేశాడు. ఈ కేసులో గతేడాది ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఇంకా జైలులోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులు, వారి లాయర్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కుతో ఢీకొట్టారు. దాంతో బాధితురాలి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు చనిపోయారు.

అత్యాచార బాధితురాలు, ఆమె తరపు న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. జరిగింది రోడ్డు ప్రమాదం కాదని… కుల్‌దీప్‌ సింగే … బాధితురాలి కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కుల్ దీప్ సింగ్, అతడి సోదరుడు మనోజ్‌తో సహా 10 మందిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

First Published:  29 July 2019 11:50 PM GMT
Next Story