Telugu Global
Cinema & Entertainment

స్టుడియో రౌండప్ (29-07-2019)

సరిలేరు నీకెవ్వరు మహేష్-రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం స్టుడియోలో ట్రయిన్ సెట్ వేశారు. ఆ సెట్ లోనే హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు తీస్తున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ ను రామోజీ ఫిలింసిటీలో ప్లాన్ చేశారు. ఫిలింసిటీలో ఈ సినిమా కోసం కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెట్ వేశారు. భీష్మ నితిన్-రష్మిక జంటగా నటిస్తున్న భీష్మ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయింది. సెకెండ్ […]

స్టుడియో రౌండప్ (29-07-2019)
X

సరిలేరు నీకెవ్వరు

మహేష్-రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం స్టుడియోలో ట్రయిన్ సెట్ వేశారు. ఆ సెట్ లోనే హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు తీస్తున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ ను రామోజీ ఫిలింసిటీలో ప్లాన్ చేశారు. ఫిలింసిటీలో ఈ సినిమా కోసం కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెట్ వేశారు.

భీష్మ

నితిన్-రష్మిక జంటగా నటిస్తున్న భీష్మ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయింది. సెకెండ్ షెడ్యూల్ కు ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రష్మిక కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయడం కష్టంగా మారింది. ఆమె కాల్షీట్లు సెట్ అవ్వగానే సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి రేపట్నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. కాకినాడలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. రీసెంట్ గా అసిస్టెంట్ డైరక్టర్ తో వచ్చిన వివాదం కారణంగా ఈ సినిమా షెడ్యూల్ ముందుగానే ముగిసిన అయిన విషయం తెలిసిందే. ఇక కాకినాడ షెడ్యూల్ విషయానికొస్తే, ఔట్ డౌర్ లో ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వాల్మీకి

వరుణ్ తేజ్, అధర్వ నటిస్తున్న ఈ సినిమాను హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా రామోజీ ఫిలింసిటీలో ఓ షెడ్యూల్ పూర్తిచేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నందికంది గ్రామంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే మధ్య రూరల్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.

వెంకీ మామ

వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా వెంకీమామ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫిలింసిటీలో ప్రస్తుతం ఓ యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు. బాబి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పాయల్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ మూవీ

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశారు. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ పై క్లారిటీ లేదు. ఎందుకంటే హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. హీరోయిన్ ఫిక్స్ అయితే తప్ప, సెకెండ్ షెడ్యూల్ ప్రారంభించే అవకాశం లేదు. ప్రస్తుతం యూనిట్ అంతా ఈ దిశగా కసరత్తు చేస్తోంది.

డిస్కోరాజా

రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తిచేశారు. ఆగస్ట్ 4 నుంచి ఢిల్లీలో మరో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఆ తర్వాత పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్తారు.

First Published:  29 July 2019 10:00 AM GMT
Next Story