బాబు సై అంటే నేనూ సై
నాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్ మరోసారి రాజకీయాలపై మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ తరపున ఆమె నగరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆమె కూడా అప్పట్లో రోజాపై పోటీకి తాను సిద్దమని ప్రకటించింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడికే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఇటీవల నటి ప్రియారామన్ బీజేపీలో చేరగా… వాణి విశ్వనాథ్ను కూడా కమలనాథులు ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఏపీలో బీజేపీకి […]
నాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్ మరోసారి రాజకీయాలపై మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ తరపున ఆమె నగరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆమె కూడా అప్పట్లో రోజాపై పోటీకి తాను సిద్దమని ప్రకటించింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడికే చంద్రబాబు టికెట్ ఇచ్చారు.
ఇటీవల నటి ప్రియారామన్ బీజేపీలో చేరగా… వాణి విశ్వనాథ్ను కూడా కమలనాథులు ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదన్న భావనతో ఆమె ఉన్నారు.
ఇప్పుడు మరోసారి టీడీపీలో చేరేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరేందుకు అంతా సిద్ధమైనా కొందరు వ్యక్తులు అడ్డుపడ్డారన్నది ఆమె ఆరోపణ. టీడీపీ ఓడిపోయిన నేపథ్యంలోనూ… తనకు ఇంకా బాబు నాయకత్వంపై నమ్మకం ఉందని వాణి విశ్వనాథ్ చెబుతున్నారు.
చంద్రబాబు ఆహ్వానిస్తే తక్షణం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి రోజాపై పోటీ చేస్తానని చెబుతున్నారు. ఒకవేళ టీడీపీ ఆహ్వానించకపోయినా, టికెట్ ఇవ్వపోయినా నగరి నుంచి వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకూ తాను వెనుకాడబోనని సన్నిహితుల వద్ద ఆమె వ్యాఖ్యానించారు.
బీజేపీలో చేరిన ప్రియారామన్ కూడా నగరి నుంచే పోటీ చేస్తానంటున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ముగ్గురు సినీతారల మధ్య నగరిలో ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.