Telugu Global
NEWS

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత పోస్ట్.. " స్పీకర్ సీరియస్‌

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత పోస్టు పెట్టిన టీడీపీ కార్యకర్త రమేష్‌ పునుగుపాటిపై కేసు నమోదైంది. రమేష్ పునుగుపాటిపై సైబర్ క్రైం, ఎస్సీఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అసెంబ్లీలో ఉన్న వైసీపీ ఆరుగురు మహిళా ఎమ్మెల్యేల ఫొటోను షేర్‌ చేసిన రమేష్ పునుగుపాటి …. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రెడ్ లైట్ ఏరియాగా మార్చారు కదరా…. అంటూ అనుచిత వ్యాఖ్యలు రాశాడు. ఈ పోస్టు బాగా వైరల్ అయింది. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలను అంత […]

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత పోస్ట్..  స్పీకర్ సీరియస్‌
X

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత పోస్టు పెట్టిన టీడీపీ కార్యకర్త రమేష్‌ పునుగుపాటిపై కేసు నమోదైంది. రమేష్ పునుగుపాటిపై సైబర్ క్రైం, ఎస్సీఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అసెంబ్లీలో ఉన్న వైసీపీ ఆరుగురు మహిళా ఎమ్మెల్యేల ఫొటోను షేర్‌ చేసిన రమేష్ పునుగుపాటి …. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రెడ్ లైట్ ఏరియాగా మార్చారు కదరా…. అంటూ అనుచిత వ్యాఖ్యలు రాశాడు.

ఈ పోస్టు బాగా వైరల్ అయింది. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలను అంత నీచంగా కించపరిచినా పార్టీ వైపు నుంచి పెద్దగా స్పందన లేదు. అయితే ఈ అంశం తన దృష్టికి రావడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్‌గా స్పందించారు.

వెంటనే రమేష్ పునుగుపాటిపై ఫిర్యాదు చేయాల్సిందిగా అసెంబ్లీ సిబ్బందిని ఆదేశించారు. స్పీకర్ ఆదేశాల మేరకు తుళ్లూరు పీఎస్‌లో అసెంబ్లీ సిబ్బంది సదరు టీడీపీ కార్యకర్తపై ఫిర్యాదు చేయగా… పోలీసులు కేసు నమోదు చేశారు.

First Published:  27 July 2019 2:49 AM GMT
Next Story