Telugu Global
Cinema & Entertainment

మరోసారి కలుస్తున్నారు....

స్కెచ్, సామి 2, మిస్టర్ కేకే సినిమాలు వరుసగా పరాజయం పొందడం తో విక్రమ్ కెరీర్ ఒక్కసారి గా కుదేలయింది. అయితే విక్రమ్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో ఏదో ఒక విధం గా మళ్ళీ విజయాన్ని అందిపుచ్చుకుంటాడు అనే ధీమా తో ఉన్నారు. వారి ఆశలన్నీ విక్రమ్ త్వరలో చేయబోయే మని రత్నం సినిమా మీదనే ఉన్నాయి. మణిరత్నం తో ఇంతకు ముందు విక్రమ్ పని చేయడం తో…. ఇప్పుడు మరో సినిమా రాబోతుండడంతో […]

మరోసారి కలుస్తున్నారు....
X

స్కెచ్, సామి 2, మిస్టర్ కేకే సినిమాలు వరుసగా పరాజయం పొందడం తో విక్రమ్ కెరీర్ ఒక్కసారి గా కుదేలయింది. అయితే విక్రమ్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో ఏదో ఒక విధం గా మళ్ళీ విజయాన్ని అందిపుచ్చుకుంటాడు అనే ధీమా తో ఉన్నారు. వారి ఆశలన్నీ విక్రమ్ త్వరలో చేయబోయే మని రత్నం సినిమా మీదనే ఉన్నాయి. మణిరత్నం తో ఇంతకు ముందు విక్రమ్ పని చేయడం తో…. ఇప్పుడు మరో సినిమా రాబోతుండడంతో చాలా అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు.

మణిరత్నం దర్శకత్వం లో త్వరలో రానున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ లో విక్రమ్ ఒక ముఖ్య పాత్ర పోషించనున్నాడు. ఈ విషయాన్ని విక్రమ్ కూడా ధృవీకరించాడు. జనవరి నుంచి షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా లో విక్రమ్ ‘ఆదిత్య కారకాలన్’ అనే పాత్ర ని పోషించనున్నాడట.

“మణిరత్నం సర్ నాకు కథ వినిపించినప్పుడు, నాకు బాగా నచ్చింది. అందుకనే వెంటనే సినిమా ని ఒప్పుకున్నాను, ఎప్పటి నుంచో ఇలాంటి సినిమా ఒకటి చేయాలి అని ఎదురు చూస్తున్నాను. మొత్తానికి ఇది దొరికింది. ఈ సినిమా లో ఐశ్వర్య రాయ్ తో నటిస్తున్నాను” అని విక్రమ్ తెలిపాడు.

First Published:  27 July 2019 2:11 AM GMT
Next Story