Telugu Global
NEWS

కోన్ కిస్కాగాడితో యుద్ధం చేయడం కమ్యూనిస్టులకు కష్టమే

విజయవాడ నేతలు ట్విట్టర్‌లో తలపడుతున్నారు. కేశినేని నాని ట్విట్టర్‌ ద్వారానే తన ప్రత్యర్థులపై ట్వీట్లు వేస్తున్నారు. తాను తప్ప అందరూ చెడిపోయారన్న భావనతో కూడిన ట్వీట్‌లు ఆయన నుంచి జాలువారుతున్నాయి. ఇప్పుడు నాని కమ్యూనిస్టులపై ట్విట్టర్‌ లో పోరాటం చేస్తున్నారు. తాను జీతాలు ఎగ్గొట్టిన కార్మికులకు కమ్యూనిస్టులు అండగా నిలవడంపై నానికి కోపం వచ్చింది. కమ్యూనిస్టులను కిరాయి పార్టీలు అంటూ అభివర్ణించారు. ఇలాంటి పనుల వల్లే ఎంతో ఘనకీర్తి ఉన్న కమ్యూనిస్టులు దేశంలో కనుమరుగు అవుతున్నారంటూ కేశినేని […]

కోన్ కిస్కాగాడితో యుద్ధం చేయడం కమ్యూనిస్టులకు కష్టమే
X

విజయవాడ నేతలు ట్విట్టర్‌లో తలపడుతున్నారు. కేశినేని నాని ట్విట్టర్‌ ద్వారానే తన ప్రత్యర్థులపై ట్వీట్లు వేస్తున్నారు. తాను తప్ప అందరూ చెడిపోయారన్న భావనతో కూడిన ట్వీట్‌లు ఆయన నుంచి జాలువారుతున్నాయి.

ఇప్పుడు నాని కమ్యూనిస్టులపై ట్విట్టర్‌ లో పోరాటం చేస్తున్నారు. తాను జీతాలు ఎగ్గొట్టిన కార్మికులకు కమ్యూనిస్టులు అండగా నిలవడంపై నానికి కోపం వచ్చింది. కమ్యూనిస్టులను కిరాయి పార్టీలు అంటూ అభివర్ణించారు. ఇలాంటి పనుల వల్లే ఎంతో ఘనకీర్తి ఉన్న కమ్యూనిస్టులు దేశంలో కనుమరుగు అవుతున్నారంటూ కేశినేని ట్వీట్ చేశారు. ఇందుకు వైసీపీ నేత పీవీపీ స్పందించారు. తనదీ కేశినేని నాని తరహా బాధే అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు పీవీపీ.

”ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవటంవల్లే.. ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది” అని కేశినేని నాని ట్వీట్ చేయగా… అందుకు స్పందించిన పీవీపీ…. తాను కూడా ఆ విషయంపైనే బాధపడుతున్నానని.. పండిట్ నెహ్రు లాంటి యోధాను యోధులను ‘ఢీ ‘ కొట్టిన ఎర్ర సోదరులు, ఎంతో ఘనమైన దోపిడీ చరిత్ర కలిగిన కోన్ కిస్కాగాడితో యుద్ధం చెయ్యాల్సి వస్తోంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

First Published:  27 July 2019 2:04 AM GMT
Next Story