Telugu Global
NEWS

టీడీపీ చితికి చేరితేనే.... మేం ఎదుగుతాం

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ ఎదగాలంటే ఎవరినైనా తాము తిట్టాల్సిందేనన్నారు. ఏపీలో టీడీపీ చితికి చేరినప్పుడే బీజేపీ ఎదుగుదల సాధ్యమవుతుందన్నారు. బీజేపీలోకి కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు చేరికలుంటాయన్నారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని సోము వీర్రాజు చెప్పారు. అసెంబ్లీ వద్ద మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేసిన వీర్రాజు… వైసీపీపై రాంమాధవ్‌ వ్యాఖ్యలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో ఎదిగేందుకు ఏ పార్టీనైనా బీజేపీ నేతలు తిట్టాల్సిందేనన్నారు. […]

టీడీపీ చితికి చేరితేనే.... మేం ఎదుగుతాం
X

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ ఎదగాలంటే ఎవరినైనా తాము తిట్టాల్సిందేనన్నారు. ఏపీలో టీడీపీ చితికి చేరినప్పుడే బీజేపీ ఎదుగుదల సాధ్యమవుతుందన్నారు.

బీజేపీలోకి కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు చేరికలుంటాయన్నారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని సోము వీర్రాజు చెప్పారు.

అసెంబ్లీ వద్ద మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేసిన వీర్రాజు… వైసీపీపై రాంమాధవ్‌ వ్యాఖ్యలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో ఎదిగేందుకు ఏ పార్టీనైనా బీజేపీ నేతలు తిట్టాల్సిందేనన్నారు.

ఆ సమయంలో తనకు ఎదురుపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను బీజేపీలోకి రావాల్సిందిగా సోము వీర్రాజు ఆహ్వానించారు. బుద్దా వెంకన్న బీజేపీలో చేరితే ఏపీలో అధికారంలోకి రాగానే మంత్రి పదవి కూడా ఇస్తామని వీర్రాజు హామీ ఇచ్చారు.

అందుకు బుద్దా వెంకన్న… ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేసి…. అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులు పంచుకుందామని ప్రతిపాదించాడు.

First Published:  26 July 2019 4:23 AM GMT
Next Story