Telugu Global
Cinema & Entertainment

రాహుల్ రవీంద్రన్ కు నాగార్జున మరో అవకాశం ఇచ్చాడా?

హీరోగా తెలుగు’ తమిళ భాషల్లో పలు సినిమాలు చేసిన రాహుల్ రవీంద్రన్ ఈ మధ్యనే సుశాంత్ హీరోగా నటించిన ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారి పోయాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు నాగార్జున తో సినిమా చేశాడు. ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ గా ‘మన్మధుడు 2’ సినిమా ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా కి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన తీరుతో నాగార్జున చాలా ఇంప్రెస్ అయిపోయారని […]

రాహుల్ రవీంద్రన్ కు నాగార్జున మరో అవకాశం ఇచ్చాడా?
X

హీరోగా తెలుగు’ తమిళ భాషల్లో పలు సినిమాలు చేసిన రాహుల్ రవీంద్రన్ ఈ మధ్యనే సుశాంత్ హీరోగా నటించిన ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారి పోయాడు.

మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు నాగార్జున తో సినిమా చేశాడు. ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ గా ‘మన్మధుడు 2’ సినిమా ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే ఈ సినిమా కి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన తీరుతో నాగార్జున చాలా ఇంప్రెస్ అయిపోయారని తెలుస్తోంది. అందుకే ఈ యువ దర్శకుడికి మరొక పెద్ద అవకాశం ఇస్తున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం నాగార్జున రాహుల్ రవీంద్రన్ కి అఖిల్ మరియు నాగ చైతన్య ని కలిపి ఒక మల్టి స్టారర్ సినిమాకి దర్శకత్వం వహించమని కోరారట.

దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు…. కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్త వైరల్ గా మారింది.

ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అఖిల్ మరియు నాగచైతన్య కలిసి నటించిన ‘మనం’ సినిమాలో అఖిల్ గెస్ట్ పాత్ర చేసాడు… కానీ ఈ వార్తలు నిజమైతే ఇద్దరూ కలిసి హీరోలుగా నటించటం ఇదే మొదటిసారి అవుతుంది.

First Published:  26 July 2019 2:43 AM GMT
Next Story