Telugu Global
NEWS

మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు

అసెంబ్లీ నుంచి మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలింపుపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఇచ్చిన సమాధానం సరిగా లేదంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి టీడీపీ సభ్యులు అల్లరి చేశారు. సభా కార్యక్రమాలను జరగకుండా అడ్డుకున్నారు. టీడీపీ తీరుపై ఆర్థిక మంత్రి బుగ్గన ఘాటుగా స్పందించారు. ఏపీలో ఆరు జిల్లాలను కాపాడేందుకు గోదావరి జలాలను తరలిస్తుంటే అడ్డుపడడం సిగ్గుచేటన్నారు. ఇదే చంద్రబాబు… కేసీఆర్‌తో పొత్తు కోసం హరికృష్ణ […]

మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు
X

అసెంబ్లీ నుంచి మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలింపుపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఇచ్చిన సమాధానం సరిగా లేదంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి టీడీపీ సభ్యులు అల్లరి చేశారు.

సభా కార్యక్రమాలను జరగకుండా అడ్డుకున్నారు. టీడీపీ తీరుపై ఆర్థిక మంత్రి బుగ్గన ఘాటుగా స్పందించారు.

ఏపీలో ఆరు జిల్లాలను కాపాడేందుకు గోదావరి జలాలను తరలిస్తుంటే అడ్డుపడడం సిగ్గుచేటన్నారు.

ఇదే చంద్రబాబు… కేసీఆర్‌తో పొత్తు కోసం హరికృష్ణ శవం సాక్షిగా చర్చలు జరిపారని.. ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రభుత్వంతో కలవకూడదంటున్నారని విమర్శించారు. సభ నడవకుండా చేయడమే టీడీపీ ఎమ్మెల్యేల ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. కాబట్టి ఇలాంటి వారిని మార్షల్స్ సాయంతో సభ నుంచి బయటకు పంపించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

టీడీపీ సభ్యులు శాంతించకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే గణేష్ కుమార్, అశోక్, వెలగపూడి రామకృష్ణ, వీరాంజనేయస్వామిని స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు ఈ సస్పెన్షన్‌ వేటు వేశారు.

First Published:  25 July 2019 5:40 AM GMT
Next Story