Telugu Global
NEWS

సీఎం జగన్‌ హెలిపాడ్‌ దగ్గర్లోనే 54 బాంబులు

జమ్మలమడుగులో బాంబులు బయటపడ్డాయి. భూమిలో పాతిపెట్టిన 54 బాంబులను పోలీసులు వెలికితీశారు. నాలుగు బకెట్లలో వీటిని ఉంచారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమీప బంధువు పురుషోత్తం రెడ్డికి చెందిన భూమిలోనే ఈ బాంబులు బయటపడ్డాయి. ఈ భూమిలో వెంచర్‌ వేయగా… జేసీబీ సాయంతో తవ్వుతున్న సమయంలో ఇవి బయటపడ్డాయి. దీంతో డీఎస్పీ, సీఐ తదితరులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నాలుగు బకెట్లు ఒకే చోట కాకుండా పలుచోట్ల  బయటపడ్డాయి. ఈనెల 8న ముఖ్యమంత్రి […]

సీఎం జగన్‌ హెలిపాడ్‌ దగ్గర్లోనే 54 బాంబులు
X

జమ్మలమడుగులో బాంబులు బయటపడ్డాయి. భూమిలో పాతిపెట్టిన 54 బాంబులను పోలీసులు వెలికితీశారు. నాలుగు బకెట్లలో వీటిని ఉంచారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమీప బంధువు పురుషోత్తం రెడ్డికి చెందిన భూమిలోనే ఈ బాంబులు బయటపడ్డాయి.

ఈ భూమిలో వెంచర్‌ వేయగా… జేసీబీ సాయంతో తవ్వుతున్న సమయంలో ఇవి బయటపడ్డాయి. దీంతో డీఎస్పీ, సీఐ తదితరులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నాలుగు బకెట్లు ఒకే చోట కాకుండా పలుచోట్ల బయటపడ్డాయి. ఈనెల 8న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి జమ్మలమడుగు పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడే హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు.

హెలిపాడ్‌కు సమీపంలోనే 150 మీటర్ల పరిధిలో ఈ బాంబుల బకెట్లు బయటపడ్డాయి. అయితే సీఎం వచ్చిన సమయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసినప్పటికీ సమీపంలోనే ఉన్న బాంబులను ఎందుకు గుర్తించలేకపోయారు అన్న దానిపైనా చర్చ జరుగుతోంది.

First Published:  23 July 2019 9:48 PM GMT
Next Story