Telugu Global
Cinema & Entertainment

'శంకర్' ను చూసి ఫీల్ అవుతున్న దిల్ రాజు

గతంలో పూరి జగన్నాధ్ తీసిన మెహబూబా సినిమాను దిల్ రాజు రిలీజ్ చేశాడు. తెలుగు రాష్ట్రాల మొత్తం థియేట్రికల్ రైట్స్ దిల్ రాజు తీసుకున్నాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో పూరి సినిమాలు టచ్ చేయడానికి దిల్ రాజు భయపడ్డాడు. ఇందులో భాగంగానే ఇస్మార్ట్ శంకర్ సినిమాను కూడా లైట్ తీసుకున్నాడు. నిజానికి సినిమా కంప్లీట్ అయిన తర్వాత పూరి జగన్నాధ్, ఫస్ట్ కలిసింది దిల్ రాజునే. తమ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయమని […]

శంకర్ ను చూసి ఫీల్ అవుతున్న దిల్ రాజు
X

గతంలో పూరి జగన్నాధ్ తీసిన మెహబూబా సినిమాను దిల్ రాజు రిలీజ్ చేశాడు. తెలుగు రాష్ట్రాల మొత్తం థియేట్రికల్ రైట్స్ దిల్ రాజు తీసుకున్నాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో పూరి సినిమాలు టచ్ చేయడానికి దిల్ రాజు భయపడ్డాడు. ఇందులో భాగంగానే ఇస్మార్ట్ శంకర్ సినిమాను కూడా లైట్ తీసుకున్నాడు.

నిజానికి సినిమా కంప్లీట్ అయిన తర్వాత పూరి జగన్నాధ్, ఫస్ట్ కలిసింది దిల్ రాజునే. తమ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయమని అడిగాడు పూరి. కానీ మెహబూబా అనుభవాలతో దిల్ రాజు ఇస్మార్ట్ ను టచ్ చేయడానికి ఇష్టంచూపలేదు. దీంతో వేరే బయ్యర్లతో నైజాంలో సినిమాను రిలీజ్ చేశారు. కట్ చేస్తే, ఇప్పుడా సినిమాను తీసుకోనందుకు దిల్ రాజు బాధపడుతున్నాడు.

నైజాంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాను 7 కోట్ల 20 లక్షల రూపాయలకు అమ్మారు. ఆ మొత్తం విడుదలైన 3 రోజులకే వచ్చేసింది. నాలుగో రోజు నుంచి ఈ సినిమా నైజాంలో లాభాలు రావడం మొదలయ్యాయి. నిన్నట్నుంచి ఈ మూవీకి ఓ
ఓవర్ ఫ్లోస్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇలాంటి భారీ లాభాలు తెచ్చిపెట్టే సినిమాను మిస్ చేసినందుకు దిల్ రాజు బాధపడుతున్నాడు.

First Published:  24 July 2019 5:55 AM GMT
Next Story