Telugu Global
National

ఏ క్షణమైనా నేను చనిపోవచ్చు- అక్బరుద్దీన్

తాను ఏ క్షణమైనా చనిపోవచ్చని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ప్రసంగించిన అక్బరుద్దీన్ ఓవైసీ… ఎప్పుడైనా తాను చనిపోవచ్చని వైద్యులు చెప్పారన్నారు. తనకు మరణం విషయంలో బాధ లేదని… కానీ కరీంనగర్‌లో బీజేపీ బలపడడం బాధగా ఉందన్నారు. గతంలో కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌గా ఎంఐఎం వ్యక్తి ఉండేవారని… ఇప్పుడు మాత్రం బీజేపీ వ్యక్తి ఉన్నారని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కూడా ఎంఐఎంకు ఓటు వేయకపోయినా పర్వాలేదని… కానీ బీజేపీకి మాత్రం […]

ఏ క్షణమైనా నేను చనిపోవచ్చు- అక్బరుద్దీన్
X

తాను ఏ క్షణమైనా చనిపోవచ్చని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ప్రసంగించిన అక్బరుద్దీన్ ఓవైసీ… ఎప్పుడైనా తాను చనిపోవచ్చని వైద్యులు చెప్పారన్నారు.

తనకు మరణం విషయంలో బాధ లేదని… కానీ కరీంనగర్‌లో బీజేపీ బలపడడం బాధగా ఉందన్నారు. గతంలో కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌గా ఎంఐఎం వ్యక్తి ఉండేవారని… ఇప్పుడు మాత్రం బీజేపీ వ్యక్తి ఉన్నారని వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో కూడా ఎంఐఎంకు ఓటు వేయకపోయినా పర్వాలేదని… కానీ బీజేపీకి మాత్రం ఓటు వేయవద్దని ప్రజలను కోరారు.

గతంలో పాతబస్తీలో మహ్మద్ పహిల్వాన్‌ వర్గీయులు అక్బర్‌పై దాడి చేశారు. ఆ సమయంలో ఓవైసీ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తొలుత చికిత్స ద్వారా కోలుకున్నా…. ఇటీవల తిరిగి పరిస్థితి దెబ్బతింది. వైద్యం కోసం కొద్ది రోజుల క్రితమే లండన్‌ వెళ్లివచ్చారు.

First Published:  24 July 2019 6:58 AM GMT
Next Story