Telugu Global
International

కర్నూలు జిల్లాలో విలువైన వజ్రం లభ్యం...

కర్నూలు జిల్లాలో ఒక వజ్రం దొరికింది. తుగ్గలి మండలం గొల్లవనేపల్లిలో ఒక రైతు పొలం వద్ద ఈ వజ్రం దొరికింది. దీని విలువ 60లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వజ్రాన్ని గుత్తికి చెందిన ఒక వ్యాపారి 15 లక్షల నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చేసి రైతు నుంచి కొనుగోలు చేశారు. ఈ విషయం ఆ నోటా ఈనోటా బయటపడింది. వజ్రం ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. వర్షకాలం కర్నూలు, అనంతపురం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో […]

కర్నూలు జిల్లాలో విలువైన వజ్రం లభ్యం...
X

కర్నూలు జిల్లాలో ఒక వజ్రం దొరికింది. తుగ్గలి మండలం గొల్లవనేపల్లిలో ఒక రైతు పొలం వద్ద ఈ వజ్రం దొరికింది. దీని విలువ 60లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.

అయితే ఈ వజ్రాన్ని గుత్తికి చెందిన ఒక వ్యాపారి 15 లక్షల నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చేసి రైతు నుంచి కొనుగోలు చేశారు. ఈ విషయం ఆ నోటా ఈనోటా బయటపడింది. వజ్రం ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

వర్షకాలం కర్నూలు, అనంతపురం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. వర్షం వచ్చి తగ్గాక పొలాల్లో వజ్రాలు బయటపడుతుంటాయి. వాటిని వ్యాపారులు స్థానికంగానే తిష్టవేసి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షభావం కారణంగా వజ్రాల వేట కూడా పెద్దగా లేదు.

First Published:  20 July 2019 3:57 AM GMT
Next Story