Telugu Global
Cinema & Entertainment

ప్రైమ్ లో విడుదలైంది.... ఇక సెలబ్రేషన్స్ లేనట్లే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్ర లో వచ్చిన చిత్రం మహర్షి. ఈ సినిమా పెద్ద విజయం సాధించి యాభై రోజులు కూడా పూర్తి చేసుకుంది. అయితే ముందు నుండి ఒక అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ ని ఫాలో అవుతూ రావడం వలన సినిమా యూనిట్ ఈ సినిమా కి మంచి అటెన్షన్ తీసుకొని రావడం లో విజయం సాధించారు. అంతే కాకుండా ఈ సినిమా ని మహేష్ ఎక్కడకి వెళ్లినా, అక్కడ పోస్ట్స్ పెట్టి […]

ప్రైమ్ లో విడుదలైంది.... ఇక సెలబ్రేషన్స్ లేనట్లే?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్ర లో వచ్చిన చిత్రం మహర్షి. ఈ సినిమా పెద్ద విజయం సాధించి యాభై రోజులు కూడా పూర్తి చేసుకుంది. అయితే ముందు నుండి ఒక అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ ని ఫాలో అవుతూ రావడం వలన సినిమా యూనిట్ ఈ సినిమా కి మంచి అటెన్షన్ తీసుకొని రావడం లో విజయం సాధించారు. అంతే కాకుండా ఈ సినిమా ని మహేష్ ఎక్కడకి వెళ్లినా, అక్కడ పోస్ట్స్ పెట్టి సినిమా సెలెబ్రేషన్స్ గురించి చెప్పేవాడు.

సినిమా యాభై రోజుల మైలురాయి దగ్గరకి రావడం తో చిత్ర యూనిట్ ఒక ఈవెంట్ ని నిర్వహించాలని అనుకున్నారు… కాకపోతే విజయ నిర్మలఆకస్మిక మరణం తో చిత్ర యూనిట్ ఈవెంట్ క్యాన్సిల్ చేసింది. కొత్త డేట్ ప్రకటిస్తాము అని చెప్పారు… కానీ ఇప్పుడు ఇక ఆ ఈవెంట్ చేయాలనే ఆలోచన ని విరమించుకున్నారట.

కొద్దో గొప్పో మహర్షి ఇంకా థియేటర్ల లో బాగా ఆడుతుంది అని నిర్మాతల నమ్మకం. ఈ దశ లో సినిమా ని ప్రైమ్ లో విడుదల చేసేయడం తో ఇక సినిమా కలెక్షన్స్ ఆగిపోయినట్టే అని భావించారట మహేష్.

ప్రైమ్ లో విడుదలను కొన్ని రోజులు ఆపాలని చూసారు…. కానీ ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ దృష్ట్యా వారు సినిమా విడుదల చేశారు. ఈ విషయం లో మహేష్ కొంత అసహనానికి గురై వెంటనే సరిలేరు నీకెవరు మీద ఫోకస్ పెట్టారట.

ఆయన ఎలాగో ఇప్పుడు హైదరాబాద్ లో లేరు. ఆయన మైండ్ లో మహర్షి కూడా లేదు…. కనుక ఇక యాభై రోజుల ఈవెంట్ చేసి వేస్ట్ అని అందరూ అనుకుంటున్నారట.

First Published:  8 July 2019 4:42 AM GMT
Next Story