రాంమాధవ్కు ఘోర అవమానం...
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్కు తానా సభల్లో అవమానం జరిగింది. తానా పిలుపుమేరకు వెళ్లిన ఆయన్ను తానా సభలోనే అవమానించి పంపించారు. తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించేందుకు రాంమాధవ్ వేదికపైకి రాగానే ఒక్కసారిగా సభికులు నినాదాలు చేశారు. మోడీకి, రాంమాధవ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుపడ్డారు. కేకలు వేస్తున్నా… కాసేపు రాంమాధవ్ ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే కొందరు బీజేపీని, మోడీని తిడుతూ కేకలు వేయడంతో రాంమాధవ్ నొచ్చుకుని ప్రసంగాన్ని ఆపేశారు. తనకు ఎదురైన చేదు అనుభవంతో […]
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్కు తానా సభల్లో అవమానం జరిగింది. తానా పిలుపుమేరకు వెళ్లిన ఆయన్ను తానా సభలోనే అవమానించి పంపించారు. తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించేందుకు రాంమాధవ్ వేదికపైకి రాగానే ఒక్కసారిగా సభికులు నినాదాలు చేశారు.
మోడీకి, రాంమాధవ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుపడ్డారు. కేకలు వేస్తున్నా… కాసేపు రాంమాధవ్ ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే కొందరు బీజేపీని, మోడీని తిడుతూ కేకలు వేయడంతో రాంమాధవ్ నొచ్చుకుని ప్రసంగాన్ని ఆపేశారు. తనకు ఎదురైన చేదు అనుభవంతో ముఖంలో నెత్తురుచుక్క లేకుండాపోయింది.
రాంమాధవ్ను తానా సభకు పిలివడం వెనుక…. టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ దూకుడుగా వెళ్లకుండా కాకాపట్టే ఉద్దేశం ఉందని కూడా విమర్శలు వచ్చాయి. అయితే రాంమాధవ్ను సభికులు ఇలా అవమానించడంతో తానా నిర్వహకులు కంగుతిన్నారు.
వెంటనే తానా అధ్యక్షుడు జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ వినలేదు. దాంతో రాంమాధవ్ స్టేజీ దిగి వెళ్లిపోయారు. రాంమాధవ్కు మర్యాదలు చేసి టీడీపీకి మంచి చేద్దామని తానా పెద్దలు భావిస్తే పరిస్థితి ఇలా తయారైంది.
తానా అన్నది టీడీపీ అనుబంధ సంస్థ అని తెలిసి కూడా పిలవగానే వెళ్లిన రాంమాధవ్కు కూడా విషయం తెలిసొచ్చిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.