Telugu Global
NEWS

బాబుపై బ్లాక్‌ మెయిల్ పంజా

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి బ్లాక్‌మెయిల్‌ పాలిటిక్స్ తలనొప్పిగా మారాయి. ఎన్నికల సమయంలో ఒక సామాజికవర్గానికి భారీగా ఎన్నికల నిధులు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్‌లు…. ఇతర వర్గాల వారికి పెద్దగా నిధులు ఇవ్వలేదన్న ఆరోపణ ఉంది. ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, అదే సమయంలో బీజేపీ టీడీపీ నేతలకు వలవేయడం మొదలుపెట్టింది. ఇదే అదనుగా టీడీపీలోని కొన్ని వర్గాలకు చెందిన నేతలు… ఎన్నికల ఖర్చు నిధుల పేరిట భారీగా చంద్రబాబు నుంచి లాగేందుకు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో భారీగా […]

బాబుపై బ్లాక్‌ మెయిల్ పంజా
X

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి బ్లాక్‌మెయిల్‌ పాలిటిక్స్ తలనొప్పిగా మారాయి. ఎన్నికల సమయంలో ఒక సామాజికవర్గానికి భారీగా ఎన్నికల నిధులు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్‌లు…. ఇతర వర్గాల వారికి పెద్దగా నిధులు ఇవ్వలేదన్న ఆరోపణ ఉంది.

ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, అదే సమయంలో బీజేపీ టీడీపీ నేతలకు వలవేయడం మొదలుపెట్టింది. ఇదే అదనుగా టీడీపీలోని కొన్ని వర్గాలకు చెందిన నేతలు… ఎన్నికల ఖర్చు నిధుల పేరిట భారీగా చంద్రబాబు నుంచి లాగేందుకు పావులు కదుపుతున్నారు.

ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయామని.. అందుకే తాము కొత్త దారి చూసుకుంటున్నామని పరోక్షంగా అధినేతకు సంకేతాలు పంపుతున్నారు. గుంపులు గుంపులుగా సమావేశం కూడా అవుతున్నారు. వారు ఎందుకు అలా చేస్తున్నారో ఒక నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు… పోస్ట్ పోల్ ప్యాకేజ్‌ ప్రకటించేందుకు సిద్దమయ్యారు.

ఆర్థిక ఇబ్బందుల పేరుతో పార్టీ మారాల్సిన అవసరం లేదంటూ పలువురు నేతలకు భారీగా డబ్బులు సర్దుబాటు చేస్తున్నారు చంద్రబాబునాయుడు. ఇప్పటికే చంద్రబాబు ఆఫర్లు అందుకున్న పలువురు నేతలు తాము చంద్రబాబును వదిలి వెళ్లేది లేదంటూ గట్టిగా చెబుతున్నారు. ఒకరిని చూసుకుని మరొకరు అన్నట్టు…. ఇదే దారిలో మరింత మంది నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు పోయినా పర్వాలేదు… పార్టీ నిలబడితే చాలు అన్నట్టుగానే చంద్రబాబు కూడా ఖర్చుకు వెనుకాడడం లేదని చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీని బూచిగా చూపించే అవకాశం వల్ల కాసుల వర్షం కురుస్తోందని టీడీపీ నేతలు సంబరపడుతున్నారు.

First Published:  2 July 2019 2:27 AM GMT
Next Story