Telugu Global
Cinema & Entertainment

కీలక ఘట్టం లోకి 'విరాట పర్వం'

శ్రీ విష్ణు హీరో గా ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో దర్శకుడి గా తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టి మొదటి సినిమా తో నే మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు ‘వేణు ఉడుగుల’. అంతే కాకుండా చాలా మంది చూపు ని కూడా ఆకర్షించాడు. ఒక మంచి కథ తో సినిమా తీస్తే ఇలా ఉంటుంది అని తెలియజేశాడు. కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహీరోయిన్లుగా […]

కీలక ఘట్టం లోకి విరాట పర్వం
X

శ్రీ విష్ణు హీరో గా ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో దర్శకుడి గా తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టి మొదటి సినిమా తో నే మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు ‘వేణు ఉడుగుల’. అంతే కాకుండా చాలా మంది చూపు ని కూడా ఆకర్షించాడు.

ఒక మంచి కథ తో సినిమా తీస్తే ఇలా ఉంటుంది అని తెలియజేశాడు. కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహీరోయిన్లుగా పెట్టి ‘విరాట పర్వం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రారంభం అవ్వడమే కాకా ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. పూర్తి స్థాయి లో తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా ఈ విరాట పర్వం రూపుదిద్దుకుంటుంది.

దర్శకుడు వేణు ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరితగతిన ఈ సినిమా ని పూర్తి చేయాలి అనే ఉదేశ్యం తో ముందుకు వెళ్తున్నాడు. అందుకే మొదటి షెడ్యూల్ ని చాలా త్వరగా పూర్తి చేశారు. ఇక కీలకమైన షెడ్యూల్ ఇప్పుడు మొదలు కానుంది. ఇందులో రానా మరియు సాయి పల్లవి పాల్గొననున్నారు.

First Published:  1 July 2019 11:40 AM GMT
Next Story