Telugu Global
Cinema & Entertainment

బిగ్ బాస్ లో... సాయి పల్లవి దోస్త్...!

అతి త్వరలో మా టీవీ లో బిగ్ బాస్ షో మూడో సీజన్ మొదలు కానుంది. ఈ షో ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. చాలా కష్టం మీద ఈ షో ని హోస్ట్ చేయడానికి నాగార్జున ని ఒప్పించిన నిర్వాహకులు…. ఇప్పుడు కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేయడం లో బిజీ అయిపోయారు. అయితే ఇప్పటి వరకు ఈ షో లో ఎవరు పాల్గొంటున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు. మీడియా […]

బిగ్ బాస్ లో... సాయి పల్లవి దోస్త్...!
X

అతి త్వరలో మా టీవీ లో బిగ్ బాస్ షో మూడో సీజన్ మొదలు కానుంది. ఈ షో ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. చాలా కష్టం మీద ఈ షో ని హోస్ట్ చేయడానికి నాగార్జున ని ఒప్పించిన నిర్వాహకులు…. ఇప్పుడు కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేయడం లో బిజీ అయిపోయారు.

అయితే ఇప్పటి వరకు ఈ షో లో ఎవరు పాల్గొంటున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు. మీడియా లో చాలా వార్తలు వస్తున్నా….. షోలో ఉన్న వాళ్ళు ఎవరూ అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

అయితే ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఈ షో లో గాయత్రి గుప్తా అనే నటి ఉండబోతుందట. ఫిదా సినిమా లో ఈమె సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించింది. అంతే కాకుండా రామ్ గోపాల్ వర్మ తీసిన ఐస్ క్రీమ్ 2 సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర చేసింది.

ఇంకా చాలా సినిమాల్లో కూడా ఆమె నటించడం విశేషం. ప్రస్తుతం మీడియా లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈమె బిగ్ బాస్ షో లో పాల్గొననుంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తి అయింది అని తెలుస్తుంది.

First Published:  30 Jun 2019 2:55 AM GMT
Next Story