Telugu Global
NEWS

ఎల్లుండే ప్రజావేదికను కూల్చేస్తాం " జగన్‌ సంచలన ఆదేశాలు

ప్రజావేదికపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రజావేదిక భవనంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించిన జగన్… ప్రజావేదిక అంశాన్ని ప్రస్తావించారు. ఈ నిర్మాణం అన్ని నిబంధనలను తోసి పుచ్చి అక్రమంగా, అన్యాయంగా ఈ భవనాన్ని గత ప్రభుత్వం కట్టించిందన్నారు. నదీ నిబంధనలు, లోకాయుక్త ఆదేశాలు అన్నీ పక్కన పెట్టి అక్రమంగా దీన్ని నిర్మించారన్నారు. ఈ నిర్మాణాన్ని చూపించేందుకే ఇక్కడ కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేశామన్నారు. అదే ఒక సామాన్యుడు ఇలా అక్రమంగా నిర్మాణం […]

ఎల్లుండే ప్రజావేదికను కూల్చేస్తాం  జగన్‌ సంచలన ఆదేశాలు
X

ప్రజావేదికపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రజావేదిక భవనంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించిన జగన్… ప్రజావేదిక అంశాన్ని ప్రస్తావించారు.

ఈ నిర్మాణం అన్ని నిబంధనలను తోసి పుచ్చి అక్రమంగా, అన్యాయంగా ఈ భవనాన్ని గత ప్రభుత్వం కట్టించిందన్నారు. నదీ నిబంధనలు, లోకాయుక్త ఆదేశాలు అన్నీ పక్కన పెట్టి అక్రమంగా దీన్ని నిర్మించారన్నారు.

ఈ నిర్మాణాన్ని చూపించేందుకే ఇక్కడ కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేశామన్నారు. అదే ఒక సామాన్యుడు ఇలా అక్రమంగా నిర్మాణం చేసి ఉంటే ఎప్పుడో ప్రభుత్వం కూల్చేసేదన్నారు.

చట్టం అందరికీ సమానమే కాబట్టి… ఎల్లుండే ఈ ప్రజావేదిక నిర్మాణాన్ని కూల్చేస్తామని ప్రకటించారు. కలెక్టర్ల సదస్సు రేపు ముగుస్తుందని… ఎల్లుండే ఈ నిర్మాణం నేలమట్టం చేస్తామన్నారు.

First Published:  24 Jun 2019 1:36 AM GMT
Next Story