Telugu Global
NEWS

మురళీమోహన్ ని పరామర్శించిన మెగాస్టార్ దంపతులు

ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఒక నటుడిగా మాత్రమే కాక నిర్మాతగా, బిజినెస్ మాన్ గా మరియు రాజకీయ నాయకుడిగా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన మురళీమోహన్ ఈ మధ్యనే అస్వస్థతతకు గురయ్యాడు. తాజాగా మురళీమోహన్ వెన్నెముకకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మురళీమోహన్ ని పలకరించటానికి మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లారు. ఇవాళ […]

మురళీమోహన్ ని పరామర్శించిన మెగాస్టార్ దంపతులు
X

ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఒక నటుడిగా మాత్రమే కాక నిర్మాతగా, బిజినెస్ మాన్ గా మరియు రాజకీయ నాయకుడిగా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన మురళీమోహన్ ఈ మధ్యనే అస్వస్థతతకు గురయ్యాడు.

తాజాగా మురళీమోహన్ వెన్నెముకకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మురళీమోహన్ ని పలకరించటానికి మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లారు.

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి…. సురేఖ తో కలిసి మురళీమోహన్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన బాగోగులు కనుక్కోవడం మాత్రమే కాక కాసేపు అక్కడే ఉండి ఆయనతో మాట్లాడి వచ్చినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి మరియు మురళీమోహన్ కలిసి ‘చిరంజీవి’, ‘మన ఊరి పాండవులు’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కలిసి నటించాడు. గతేడాది మురళీమోహన్ బాలకృష్ణ హీరోగా నటించిన ‘జై సింహా’ సినిమాలో కనిపించాడు.

First Published:  1 Jun 2019 5:25 AM GMT
Next Story