Telugu Global
Cinema & Entertainment

అడ్వాంసులు వెనక్కి తీసుకుంటున్న మైత్రి సంస్థ?

అతి కొద్ది సమయంలోనే టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది మైత్రి మూవీ మేకర్స్. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాక మొదట్లో ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ లు అందుకున్నారు. అప్పట్లోనే స్టార్ హీరోలకు, దర్శకులకు అడ్వాంసులు ఇచ్చేసారు. కానీ తర్వాత వారి తప్పుతెలుసుకున్నారట. త్వరలో సినిమాలు చేసేద్దామని వారికి అడ్వాంసులు ఇచ్చారు. కానీ అవన్నీ వాయిదా పడుతూనే వచ్చాయి. ఆ స్టార్ హీరోలు, డైరెక్టర్లు వారి కమిట్ మెంట్ల వల్ల మైత్రితో వెంటనే […]

అడ్వాంసులు వెనక్కి తీసుకుంటున్న మైత్రి సంస్థ?
X

అతి కొద్ది సమయంలోనే టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది మైత్రి మూవీ మేకర్స్. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాక మొదట్లో ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ లు అందుకున్నారు. అప్పట్లోనే స్టార్ హీరోలకు, దర్శకులకు అడ్వాంసులు ఇచ్చేసారు. కానీ తర్వాత వారి తప్పుతెలుసుకున్నారట.

త్వరలో సినిమాలు చేసేద్దామని వారికి అడ్వాంసులు ఇచ్చారు. కానీ అవన్నీ వాయిదా పడుతూనే వచ్చాయి. ఆ స్టార్ హీరోలు, డైరెక్టర్లు వారి కమిట్ మెంట్ల వల్ల మైత్రితో వెంటనే సినిమాలు చేయలేని పరిస్థితి. కానీ ఆ సినిమాలు ఆలస్యమవ్వడం తో మైత్రి వారికి నచ్చడం లేదట.

త్రివిక్రమ్, బోయపాటి లాంటి దర్శకులకు మైత్రి వారు అడ్వాన్సులు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరి నుంచి అడ్వాంసులు వెనక్కి తీసుకోబోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక స్టార్ హీరోలు, దర్శకులు వద్దు మీడియం రేంజి హీరోలు చాలు అని వరుసగా సినిమాలకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. నాని, విజయ దేవరకొండ, శర్వానంద్ లాంటి హీరోలతో సినిమాలు చేసేందుకు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రెండు సినిమాలు, శర్వానంద్ తో ఓ సినిమా, సాయిధరమ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా, బన్నితో ఏఏ 20 చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్ సంస్థ వారు నిర్మిస్తున్నారు.

First Published:  8 May 2019 1:15 AM GMT
Next Story